యాప్నగరం

అవకతవకలు వద్దు... కేసీఆర్ ప్రభుత్వంపై ఎంపీ అసదుద్దీన్ ట్వీట్లు

ప్రతిపక్షాలన్నీ కేసీఆర్‌కు మిత్రపక్షం అని చెబుతున్న ఎంఐఎం సైతం ఈసారి ఎన్నికల్లో టీఆర్ఎస్‌పై విమర్శలు చేస్తోంది. తాజాగా ఆ పార్టీ ఎంపీ అసద్.. ప్రభుత్వంపై సోషల్ మీడియాలో పలు పోస్టులు పెట్టారు.

Samayam Telugu 24 Nov 2020, 10:31 am
జీహెచ్ఎంసీ ఎన్నికల వేళ ప్రభుత్వంపై అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ప్రతిపక్ష పార్టీల నుంచి అనేక విమర్శలు వస్తున్నాయి. ఇటు మిత్రపక్షం అని చెప్పుకుంటున్న ఎంఐఎం కూడా అధికార పార్టీపై కూడా అనేక వ్యాఖ్యలు చేస్తోంది. తాజాగా ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ... ప్రభుత్వాన్ని ఉద్దేశించి ట్వీట్లు చేశారు. లాక్ డౌన్ సమయంలో ఏప్రిల్, జూన్ లో కరెంట్ బిల్లులు ఆకాశాన్ని అంటాయన్నారు. సాధారణ రేట్ల కంటే అధికంగా ఛార్జీలు వసూలు చేశారని ఆరోపించారు అసద్. తమ సామార్ధ్యానికి మించి వినియోగదారులు కరెంట్ ఛార్జీలు చెల్లించాలన్నారు. ప్రతీ బిల్లు నుంచి కనీసం మూడవందల యూనిట్లను మాఫీ చేయాలన్నారు.
Samayam Telugu కేసీఆర్, ఎంపీ అసదుద్దీన్
kcr asad


అంతేకాకుండా వరద సాయంపై కూడా అసదుద్దీన్ సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టు పెట్టారు. డిసెంబర్ 1 తరువాత వెంటనే 10 వేల వరద సహాయం చేపట్టాలన్నారు. వరద సహాయంలో ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలన్నారు. వరదల్లో చాలా ఆటో లు , టాక్సీ వాహనాలు ధ్వంసం అయ్యాయన్నారు అసద్. డ్రైవర్ లను ప్రభుత్వం ఆదుకుని నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు అసదుద్దీన్ ఓవైసీ.

Read More: సినీ అవార్డులు పక్క రాష్ట్రాలిస్తున్నాయి.. టీఆర్ఎస్‌పై సినీ నటుడు సంచలన వ్యాఖ్యలు

మరోవైపు వరద బాధితులకు ప్రభుత్వం రూ. 10 వేల సాయం పంపిణీపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల నేపథ్యంలో వరదసాయం పంపిణీపై ప్రతిపక్షాలు లేఖరాయడంతో నిలిపివేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఎస్‌ఈసీ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ న్యాయవాది శ్రీరాంభట్ల శరత్‌ హైకోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం దాఖలు చేశారు. ఈ పిల్‌పై హైకోర్టు మంగళవారం విచారణ జరపనుంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.