యాప్నగరం

హైదరాబాద్‌లో పాముల పార్కు ప్రారంభం.. దేశంలోనే రెండోది..

Bowrampet: దేశంలో ఉన్న ఏకైక పాముల పార్కు చెన్నైలో ఉంది. తాజాగా హైదరాబాద్‌లోనూ అలాంటి పార్కు ఏర్పాటు చేయడం ప్రాధన్యం సంతరించుకుంది.

Samayam Telugu 5 Jun 2020, 7:27 pm
తెలంగాణలో తొలిసారిగా పాముల కోసం ప్రత్యేక పార్కును ఏర్పాటు చేశారు. హైదరాబాద్ పరిధిలోని బౌరంపేట రిజర్వు ఫారెస్టులో రూ.1.40 కోట్ల ఖర్చుతో దీన్ని నిర్మించారు. పాముల సంరక్షణ, పునరావాస కేంద్రం పేరుతో దీన్ని నెలకొల్పారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి ఈ పార్కును శుక్రవారం ప్రారంభించారు. జీవవైవిధ్యాన్ని పెంపొందించడంలో భాగంగా చెన్నైలోని గిండి స్నేక్ పార్క్‌కు దీటుగా పాముల సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లుగా మంత్రి చెప్పారు.
Samayam Telugu హైదరాబాద్‌లో పాముల పార్కు ప్రారంభం
Indrakaran reddy


రాష్ట్రంలోనే తొలిసారిగా ఏర్పాటు చేస్తున్న ఈ పాముల పునరావాస కేంద్రంలో ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ సహకారంతో రాష్ట్రవ్యాప్తంగా పట్టుకున్న సర్పాల సంరక్షణను చూడనున్నారు. అలాగే వివిధ రకాల పాముల గురించి ప్రజలకు అవగాహన కల్పించేందుకు కూడా ఇది ఉపయోగపడనుంది. ఎవరైకైనా పాములు కనిపిస్తే, వాటికి హాని తలపెట్టకుండా ఫ్రెండ్స్ ఆఫ్ స్నేక్ సొసైటీ (రెస్క్యూ టీం) వారికి సమాచారం ఇస్తే వారు నేరుగా ఘటనా స్థలానికి వచ్చి పామును బంధిస్తారు.

ఇప్పటి వరకూ దేశంలో ఉన్న ఏకైక పాముల పార్కు చెన్నైలో ఉంది. నగరంలోని గిండి ప్రాంతంలో ఉండే ఈ స్నేక్ పార్కుకు ప్రపంచంలోనే అత్యుత్తమ పాముల పార్కుల్లో ఒకటిగా పేరుంది. చెన్నై వెళ్లిన సందర్శకులు చాలా మంది దీన్ని సందర్శిస్తుంటారు. అయితే, తాజాగా హైదరాబాద్‌లోనూ అలాంటి పార్కు ఏర్పాటు చేయడం ప్రాధన్యం సంతరించుకుంది.

Must Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.