యాప్నగరం

మనవరాలితో కలిసి మంత్రి టేబుల్ టెన్నిస్

telangana lockdown updates: తన మనవరాలు తన్వితో కలిసి టేబుల్ టెన్నిస్‌ ఆడుతూ కనిపించారు. ఈ సందర్బంగా మంత్రి స్పందిస్తూ.. సాధారణ సమయాల్లో తనకు అసలు తీరిక ఉండదని, లాక్‌ డౌన్‌ వల్లే కొద్ది వీలు చిక్కిందని వివరించారు.

Samayam Telugu 25 Apr 2020, 3:54 pm
లాక్‌ డౌన్‌ వల్ల అంతా ఇంట్లోనే కాలక్షేపం చేస్తున్నారు. సెలబ్రిటీలు ఛాలెంజ్‌లు విసురుకుంటుంటే.. మంత్రులు, ప్రజా ప్రతినిధులు కరోనా నిరోధక చర్యల్లో నిమగ్నమయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశాలతో రాష్ట్రవ్యాప్తంగా మంత్రులు తమ శాఖల అధికారులతో నిత్యావసర వస్తువుల పంపిణీ వంటి కార్యక్రమాలతో బిజీగా ఉన్నారు. వీరికి కాస్త సమయం దొరికితే చాలు కుటుంబంతోనే ఉండేందుకు మొగ్గు చూపుతున్నారు. తెలంగాణ గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు ఇలా సమయం చిక్కడంతో మనవరాలితో కలిసి ఆడుకుంటున్నారు.
Samayam Telugu errabelli


Also Read: undefined

మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు తన మనవరాలు తన్వితో కలిసి టేబుల్ టెన్నిస్‌ ఆడుతూ కనిపించారు. ఈ సందర్బంగా మంత్రి ఎర్రబెల్లి స్పందిస్తూ.. సాధారణ సమయాల్లో తనకు అసలు తీరిక ఉండదని, లాక్‌ డౌన్‌ వల్లే కొద్ది వీలు చిక్కిందని వివరించారు. ఈ సమయాన్ని కుటుంబసభ్యులకే కేటాయిస్తున్నట్లు చెప్పారు. ప్రస్తుతం కూడా కాలక్షేపం కోసం మనవరాలితో సరదాగా టేబుల్‌ టెన్నిస్‌ ఆడుతున్నట్టు తెలిపారు. లాక్‌ డౌన్‌లో ఇంటి సభ్యులతో గడిపే అవకాశం ఎక్కువగా వచ్చింది.కరోనా మహమ్మారి నుంచి రక్షణ కోసం ప్రజలు కూడా బయటకు రావొద్దని ఇంట్లోనే ఉండి కుటుంబసభ్యులతో సమయం గడపాలని మంత్రి సూచించారు.

Also Read:కరోనా తర్వాత వచ్చే సంచలన మార్పులేంటి? కేటీఆర్ చెప్పిన 3 అంశాలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.