యాప్నగరం

81 శాతం మందికి కరోనా వచ్చి పోతుంది.. మంత్రి ఈటల వెల్లడి

Coronavirus: కరోనా విషయంలో విపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని, దేశ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉందని మంత్రి ఈటల పేర్కొన్నారు. ప్రజలంతా ప్రభుత్వంపై నమ్మకంతో ఉండాలని సూచించారు.

Samayam Telugu 30 Jul 2020, 8:52 pm
కరోనా వైరస్‌కు భయపడాల్సిన పనిలేదని, నివారణకు ప్రభుత్వం మెరుగైన చర్యలు తీసుకుంటోందని ఆరోగ్యశాఖమంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. ఎక్కడికక్కడ కరోనా పరీక్షలు చేస్తున్నామని చెప్పారు. దేశంలో పలు రాష్ట్రాలతో పోల్చుకుంటే తెలంగాణలో కరోనా కట్టడి చేయడంలో విజయం సాధించామని వెల్లడించారు. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై మంత్రి ఈటల ఓ టీవీ ఛానెల్‌తో మాట్లాడారు. దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ సడలింపులతోనే కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగింది ఈటల అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వైరస్‌ అంత తక్కువ సమయంలో తగ్గే అవకాశం లేదని, సహజీవనం చేస్తూ ముందుకెళ్లాల్సిందేనని చెప్పారు.
Samayam Telugu ఈటల రాజేందర్ (ఫైల్ ఫోటో)
etala rajender


కరోనా వైరస్‌ ప్రభావాన్ని బట్టి అది 81 శాతం మందికి సంక్రమించి, నయం అయ్యే అవకాశం ఉందని ఈటల చెప్పారు. ఈ విషయాన్ని వైద్యులు సైతం చెప్పారని మంత్రి స్పష్టం చేశారు. వైరస్‌ లక్షణాలున్న ప్రతి ఒక్కరికీ పరీక్షలు చేస్తున్నామని మంత్రి ఈటల వెల్లడించారు. సంచార ప్రయోగశాలల ద్వారా కరోనా పరీక్షల నిర్వహణ ప్రజలకు మరింత అందుబాటులోకి వచ్చిందన్నారు.undefined

ఇక కరోనా విషయంలో విపక్షాలు కావాలనే రాద్ధాంతం చేస్తున్నాయని, దేశ వ్యాప్తంగా కూడా ఇదే పరిస్థితి ఉందని పేర్కొన్నారు. ప్రజలంతా ప్రభుత్వంపై నమ్మకంతో ఉండాలని సూచించారు. ముంబయి, దిల్లీ, కోల్‌కతా, చెన్నై వంటి పెద్ద నగరాల్లో కేసుల సంఖ్య తీవ్రంగా ఉందని, హైదరాబాద్‌లో కొంత నయం అని ఈటల చెప్పారు.Also Read:undefinedPhotos:కేటీఆర్ 6 అంబులెన్స్‌లు.. కుమార్తెతో కలిసి ప్రభుత్వానికి అందజేత.. ఫోటోలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.