యాప్నగరం

మంత్రి ఈటల సహాయక సిబ్బందిలో ఏడుగురికి కరోనా

డ్రైవర్లు, పీఏలు, గన్ మెన్లు కరోనా బారిన పడినట్లు మంత్రులు తెలిపారు. దీంతో మంత్రి కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఆయన కార్యాలయాన్ని కూడా శానిటైజ్ చేశారు.

Samayam Telugu 19 Sep 2020, 7:46 am
వైద్య, ఆరోగ్య శాఖ మం త్రి ఈటల రాజేందర్‌ పేషీలో ఏడుగురు కరోనా వైరస్ బారినపడ్డారు. కరోనా సోకిన వారిలో ఇద్దరు డ్రైవర్లు, మరో ఇద్దరు పీఏలు, ముగ్గురు గన్‌మెన్లు ఉన్నట్లు మంత్రి ఈటల రాజేందర్‌ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో గురువారం తాను కూడా కరోనా పరీక్షలు చేయించుకున్నట్లు తెలిపారు. అయితే ఈ పరీ క్షలో తనకు నెగెటివ్‌ వచ్చిందన్నారు. రెండ్రోజుల త ర్వాత మరోసారి పరీక్ష చేయించుకుంటానని ఆయన తెలిపారు.
Samayam Telugu మంత్రి ఈటల రాజేందర్
minister etela rajendar


సిబ్బందిలో ఏడుగురికి కరోనా పా జిటివ్‌ రావడంతో మంత్రి కార్యాలయంలో కలకలం రేగింది. దీంతో బీఆర్కే భవన్‌లోని ఉన్న మంత్రి ఈటల కార్యాలయాన్ని పూర్తిగా శానిటైజ్‌ చేశారు. అయితే తనకు నెగెటివ్‌ వచ్చి నందున శనివారం బీఆర్కే భవన్‌లోని తన కార్యాలయానికి యథావిధిగా వస్తానని ఈటల తెలిపారు. మరోవైపు తెలంగాణలో కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. మరణాలు కూడా తాజాగా వెయ్యి దాటాయి.

Read More: ఎంపీ అసద్ కుమార్తె వివాహం.. అత్యంత సన్నిహితులకే ఆహ్వానం

శుక్రవారం కొత్తగా 2,043 పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ వెల్లడించింది. నిన్న ఒక్కరోజే కరోనాతో 11, మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో మృతుల సంఖ్య 1,016కి చేరింది. నిన్న ఒక్క రోజే 1,802 కరోనా నుండి కోలుకుని డిశ్చార్జి అయ్యారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 1,67,046కి చేరింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.