యాప్నగరం

మాస్కుల పేరుతో దోచుకుంటే కఠిన చర్యలు: మంత్రి ఈటల

Coronavirus బూచీగా చూపి మాస్కులను అధిక ధరలకు అమ్మితే కేసులు తప్పవని మంత్రి ఈటల రాజేందర్ హెచ్చరించారు.

Samayam Telugu 7 Mar 2020, 12:17 pm
రాష్ట్రంలో కరోనా వైరస్ లేదని.. అంతగా భయపడాల్సిన అవసరం లేదని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ తెలిపారు. నిరభ్యంతరంగా మార్కెట్లకు, ఇతర ప్రాంతాలకు వెళ్లొచ్చని చెప్పారు. పిల్లలను ఏ ఆందోళన లేకుండా స్కూళ్లకు పంపవచ్చని స్పష్టం చేశారు. ఆరోగ్యపరంగా అనుమానంగా ఉన్నవారికి పరీక్షల కోసం గాంధీకి ఆస్పత్రికి తరలిస్తున్నామని.. వదంతులతో కంగారు పడాల్సిన పనిలేదని వివరించారు. కరోనా వైరస్ పేరుతో మాస్కులను అధిక ధరలకు అమ్ముతున్న వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Samayam Telugu Etela Rajender


దేశంలో కరోనా కేసులు అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో కేంద్రం ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్దన్‌ శుక్రవారం (మార్చి 6) అన్ని రాష్ట్రాల ఆరోగ్య శాఖ మంత్రులు, సంబంధిత శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన మంత్రి ఈటల.. కరోనా పట్ల రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వివరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్రం చేస్తున్న కృషిని కేంద్ర మంత్రి హర్షవర్ధన్ మెచ్చుకున్నట్లు తెలిపారు.

కరోనా వైరస్‌ను బూచీగా చూపి ఫేస్ మాస్కులను ఇష్టారాజ్యంగా ఎక్కువ ధరలకు అమ్మితే కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణలో వైరాలజీ ల్యాబ్‌ ఏర్పాటు చేయాలని, ఎయిర్‌పోర్టులకు వచ్చే స్వదేశీ, విదేశీ ప్రయాణికులకు స్క్రీనింగ్ నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని వీడియో కాన్ఫరెన్స్ సందర్భంగా కేంద్ర మంత్రిని కోరినట్లు ఈటల తెలిపారు.

Also Read: జనగామలో కరోనా కలకలం.. ఆస్పత్రి నుంచి వెళ్లిపోయిన యువకుడు

కరోనాతో తెలంగాణలో ఆందోళన నెలకొన్న నేపథ్యంలో.. ఇదే అదనుగా భావించి కొంత మంది వ్యాపారులు క్యాష్ చేసుకుంటున్నారు. మాస్కుల ధరలను భారీగా పెంచారు. ఇప్పటివరకు రూ.2కి విక్రయించిన మాస్కులను కొన్ని మందుల షాపుల్లో రూ.20 నుంచి రూ.30 వరకు అమ్ముతున్నారు. డిమాండ్ పెరుగుతుండటంతో ఈ రేట్లను రోజుకింత పెంచుతున్నారు. ఇక రూ.35 - 40 విలువ చేసే ఎన్‌ 95 మాస్కులను ఏకంగా రూ.300 నుంచి 400 వరకు అమ్ముతున్నారు. కృత్రిమ కొరత సృష్టించి అమ్మకాలు సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. మాస్కులను ఉచితంగా పంపిణీ చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Must Read: తమిళనాడుకు సాయం చేద్దాం.. సీఎం జగన్‌కు కేసీఆర్ ఫోన్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.