యాప్నగరం

బీజేపీ ‘బండి’ జోరు తగ్గింది.. ఎంఐఎం మా మిత్ర పార్టీ: మంత్రి గంగుల

Karimnagar ఎంపీ బండి సంజయ్‌పై మంత్రి గంగుల కమలాకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మూడు నెలల్లోనే బండి జోరు తగ్గిందన్నారు. మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు రాకతో ప్రయోజనం ఏమీలేదన్నారు.

Samayam Telugu 20 Sep 2019, 6:39 pm
రీంనగర్‌లో టీఆర్‌ఎస్ మినహా వేరే పార్టీ లేదని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. బీజేపీ పార్టీ నేతలు జిల్లాలో హడావుడి తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. ఎంపీ బండి సంజయ్ కొంత హడావుడి చేసి ఫెయిల్ అయ్యారన్నారు. మూడు నెలల్లోనే బండి సంజయ్ జోరు తగ్గిందని పేర్కొన్నారు. శుక్రవారం (సెప్టెంబర్ 20) ఆయన మీడియాతో మాట్లాడారు.
Samayam Telugu gangula


తెలంగాణ బీజేపీ కార్యకలాపాల్లోకి మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు రావడం వల్ల ప్రయోజనం ఏమీ లేదని మంత్రి గంగుల వ్యాఖ్యానించారు. ఎంఐఎం తమకు మిత్ర పార్టీ అని పేర్కొన్న గంగుల.. వాళ్లను ఎలా మోసం చేస్తామని ప్రశ్నించారు.

Also Read: హరీశ్‌తో ఘర్షణ ఉండదు.. 14 ఏళ్ల వైరానికి చెక్ పెట్టిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

ఆ ఆలోచన లేదు..
చౌక బియ్యానికి నగదు బదిలీ చేసే అలోచన లేదని మంత్రి గంగుల కమలాకర్‌ స్పష్టం చేశారు. తెలంగాణ కంటే పెద్ద రాష్ట్రాలు చాలా ఉన్పప్పటికీ.. పథకం అమలు ఇక్కడే పక్కాగా అమలవుతోందని చెప్పారు. రాష్ట్రంలో రూపాయికి కిలో బియ్యం పథకం ద్వారా 2.66 కోట్ల మందికి ప్రయోజనం కలుగుతోందని వెల్లడించారు. నెలలో ఒకేసారి రేషన్‌ తీసుకెళ్లడం డీలర్లకు ఇబ్బందిగా మారిందంటూ సభ్యులు అడిగిన ప్రశ్నకు పౌరసరఫరాల శాఖ మంత్రి ఈ మేరకు బదులిచ్చారు. దానిని మార్చే అవకాశం లేదని స్పష్టం చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.