కరీంనగర్ జిల్లాలో మంత్రి గంగుల కమలాకర్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. మంత్రి వాహనం వెనుక ఉండే ఎస్కార్ట్ వాహనం బోల్తా పడింది. ఈ ఘటనలో కొత్తపల్లి ఎస్సైకి తీవ్ర గాయాలయ్యాయి. కరీంనగర్లోని ఆర్టీసీ వర్క్షాప్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ఎస్కార్ట్ వాహనం అదుపుతప్పి బోల్తా పడటంలో ఆ వాహనంలో ఉన్న ఎస్సై ఎల్లాగౌడ్ చేతి బొటనవేలు తెగిపోయింది. అతడిని వెంటనే సమీప ఆస్పత్రికి తరలించారు.
మరోవైపు, శనివారం కరీంనగర్ జిల్లాలో పలువురు మంత్రులు సుడిగాలి పర్యటనలు చేశారు. పార్టీ స్థానిక నాయకులను, అధికారులను వెంట బెట్టుకుని పలు పనులకు ప్రారంభాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించిన వారు కేసీఆర్పై పొగడ్తల వర్షం కురిపించారు. నగరంలోని చింతకుంట వద్ద మొక్కజొన్న వ్యవసాయ పరిశోధనా కేంద్రం నూతన భవనాన్ని, బీసీ సంక్షేమ మంత్రి గంగుల కమలాకర్తో కలిసి మరో మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ కేంద్రాన్ని ఆధునీకరించడం సంతోషంగా ఉందని నిరంజన్ రెడ్డి అన్నారు
అనంతరం రామడుగు మండలం వెలిచాల గ్రామంలో, తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట గ్రామంలో రైతువేదిక నిర్మాణానికి మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పౌరసరఫరాల సంక్షేమశాఖా మంత్రి గంగుల కమలాకర్, జిల్లా కలెక్టర్ శశాంక, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్ గారు, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ తీరును మంత్రులు ఎండగట్టారు. కేంద్రం నుంచి వ్యవసాయ రంగానికి ఎలాంటి సహకారం లభించడం లేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా అడిగితే కేంద్రం పట్టించుకోవడం లేదని అన్నారు. రైతులకు చేయూతనివ్వడం లేదని కేంద్రంపై మంత్రి నిరంజన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.
మరోవైపు, శనివారం కరీంనగర్ జిల్లాలో పలువురు మంత్రులు సుడిగాలి పర్యటనలు చేశారు. పార్టీ స్థానిక నాయకులను, అధికారులను వెంట బెట్టుకుని పలు పనులకు ప్రారంభాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో పర్యటించిన వారు కేసీఆర్పై పొగడ్తల వర్షం కురిపించారు. నగరంలోని చింతకుంట వద్ద మొక్కజొన్న వ్యవసాయ పరిశోధనా కేంద్రం నూతన భవనాన్ని, బీసీ సంక్షేమ మంత్రి గంగుల కమలాకర్తో కలిసి మరో మంత్రి నిరంజన్ రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. ఈ కేంద్రాన్ని ఆధునీకరించడం సంతోషంగా ఉందని నిరంజన్ రెడ్డి అన్నారు
అనంతరం రామడుగు మండలం వెలిచాల గ్రామంలో, తిమ్మాపూర్ మండలంలోని రేణికుంట గ్రామంలో రైతువేదిక నిర్మాణానికి మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి శంకుస్థాపన చేశారు. పౌరసరఫరాల సంక్షేమశాఖా మంత్రి గంగుల కమలాకర్, జిల్లా కలెక్టర్ శశాంక, ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్ గారు, రసమయి బాలకిషన్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కేంద్రంలోని బీజేపీ తీరును మంత్రులు ఎండగట్టారు. కేంద్రం నుంచి వ్యవసాయ రంగానికి ఎలాంటి సహకారం లభించడం లేదని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయహోదా అడిగితే కేంద్రం పట్టించుకోవడం లేదని అన్నారు. రైతులకు చేయూతనివ్వడం లేదని కేంద్రంపై మంత్రి నిరంజన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు.