యాప్నగరం

ఈ కనిపించే దేవుళ్లు దేశానికే ఆదర్శం.. హరీశ్‌రావు ఆసక్తికర ట్వీట్

Hyderabad Coronavirus: కరోనా సోకిన మహిళకు సురక్షితంగా పురుడు పోసిన వైద్యులపై ప్రశంసల జల్లు కురిపించారు. అంతేకాక కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులను కనిపించే దైవాలుగా మంత్రి హరీశ్ రావు అభివర్ణించారు.

Samayam Telugu 9 May 2020, 12:39 am
హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కరోనా బాధితురాలైన ఓ గర్భిణి శుక్రవారం పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. ప్రత్యేక జాగ్రత్తలతో గర్భిణికి గైనకాలజీ విభాగం వైద్యులు సిజేరియన్ చేసి బిడ్డను బయటకు తీశారు. కాగా, ప్రస్తుతం తల్లీ బిడ్డ ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని మంత్రి ఈటల రాజేందర్ శుక్రవారం సాయంత్రం (మే 8) నిర్వహించిన విలేరుల సమావేశంలో ప్రకటించారు. అయితే, ఈ ఘటనపై ఆర్థికశాఖ మంత్రి హరీశ్ రావు కూడా స్పందించారు. ఈ మేరకు శుక్రవారం రాత్రి ట్వీట్ చేశారు. కరోనా సోకిన మహిళకు సురక్షితంగా పురుడు పోసిన వైద్యులపై ప్రశంసల జల్లు కురిపించారు. అంతేకాక కరోనా రోగులకు చికిత్స చేస్తున్న వైద్యులను ‘కనిపించే దైవాలు’గా మంత్రి హరీశ్ రావు అభివర్ణించారు. కరోనా సోకి చికిత్స పొందుతున్న ఈ మహిళ పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఈ అరుదైన ఘటనపై నెటిజన్లు కూడా బాగా స్పందిస్తున్నారు. వైద్యుల కృషిని అభినందిస్తున్నారు.
Samayam Telugu minister harish rao applauds gandhi doctors over corona patient delivery
ఈ కనిపించే దేవుళ్లు దేశానికే ఆదర్శం.. హరీశ్‌రావు ఆసక్తికర ట్వీట్


హరీశ్ రావు ట్వీట్ ఇదీ..

‘‘కరోనా సోకిన నిండుచూలాలిలో ధైర్యం నింపి.. ప్రత్యేక జాగ్రత్తలతో ప్రసవం చేసి తల్లిబిడ్డలకు పునర్జన్మ ప్రసాదించిన మన గాంధీ హాస్పిటల్ వైద్యులు దేశానికే ఆదర్శంగా నిలిచారు. ఆ కనిపించే దైవాలకు హృదయపూర్వక కృతజ్ఞతలు. తల్లి బిడ్డలు ఆరోగ్యంగా.. ఇంటికి చేరాలని కోరుకుంటూ శుభాకాంక్షలు’’ అని మంత్రి హరీశ్ రావు ట్వీట్ చేశారు. ఈ ట్వీట్‌పై పలువురు నెటిజన్లు కూడా బాగా స్పందిస్తున్నారు. మంత్రి ఈటల రాజేందర్.. హరీశ్ రావు ట్వీట్‌ను రీట్వీట్ చేసి ఈ విధంగా స్పందించారు. ‘‘మీ అభినందనలకు ధన్యవాదములు. మీ శుభాకాంక్షలు మేం మరింత ఉత్సాహంతో పనిచేయడానికి దోహదపడతాయి.’’ అని కామెంట్ చేశారు.

కుటుంబ సభ్యులందరీకీ కరోనా..

కరోనాతో చికిత్స తీసుకుంటూ ప్రసవం అయిన మహిళ, బిడ్డ ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్లు వైద్యులు ప్రకటించారు. అయితే.. సదరు మహిళ కుటుంబంలో అందరికీ కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా తెలుస్తోంది. వారందరూ కూడా గాంధీ ఆస్పత్రిలోని ఐసోలేషన్ వార్డుల్లోనే చికిత్స పొందుతున్నారు. మరోవైపు, కరోనా సోకిన మహిళకు జన్మించిన బిడ్డకు కరోనా సోకిందా.. లేదా.. అనే అంశంపై స్పష్టత లేదు. ఈ విషయం తేలాల్సి ఉందని ఈటల ప్రెస్ మీట్‌లో చెప్పారు. అయితే, ఈ బిడ్డకు కూడా కరోనా పరీక్షలు చేస్తామని చెప్పారు.

Must Read: ‘6 ఏళ్లుగా క్వారంటైన్‌లోనే కేసీఆర్.. బతికున్నానని చెప్పేందుకే బయటికి..’

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.