తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు నడుస్తున్న విషయం తెలిసిందే. సభ ఆరో రోజు ప్రారంభమయ్యింది. శాసన సభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలిని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ఉభయ సభల్లో ప్రశ్నోత్తరాలు ప్రారంభమయ్యాయి. అనంతరం జీరో అవర్ కొనసాగనుంది. బిల్లుపై సభలో చర్చ కొనసాగనుంది.
అయితే సోమవారం ప్రారంభమైన సభకు మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. హరీశ్కు కరోనా వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆయన కరోనాను జయించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్రావు సోమవారం శాసనసభ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మిగతా ఎమ్మెల్యేందరూ కూడా కొవిడ్-19 టెస్టులు చేయించుకున్నందుకు స్పీకర్ వారందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పారు.
Read More: తెలంగాణలో ప్రజలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన కరోనా కేసులు
టెస్టులు చేయించుకోని ఎమ్మెల్యేలు ఎవరైనా తప్పనిసరిగా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. ప్రతి సభ్యుడు కొవిడ్ నిబంధనలు చేపట్టాలని సభ్యులను స్పీకర్ కోరారు. రెండ్రోజుల విరామం తర్వాత సమావేశమైన ఇవాల్టి అసెంబ్లీలో ఎనిమిది బిల్లులు సభ ముందుకు రానున్నాయి. శుక్రవారం కొత్త రెవెన్యూ బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే.
అయితే సోమవారం ప్రారంభమైన సభకు మంత్రి హరీశ్ రావు హాజరయ్యారు. హరీశ్కు కరోనా వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఆయన కరోనాను జయించిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో మంత్రి హరీష్రావు సోమవారం శాసనసభ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రికి స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. మిగతా ఎమ్మెల్యేందరూ కూడా కొవిడ్-19 టెస్టులు చేయించుకున్నందుకు స్పీకర్ వారందరికీ కూడా కృతజ్ఞతలు చెప్పారు.
Read More: తెలంగాణలో ప్రజలకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గిన కరోనా కేసులు
టెస్టులు చేయించుకోని ఎమ్మెల్యేలు ఎవరైనా తప్పనిసరిగా కొవిడ్ పరీక్షలు చేయించుకోవాలని స్పీకర్ విజ్ఞప్తి చేశారు. ప్రతి సభ్యుడు కొవిడ్ నిబంధనలు చేపట్టాలని సభ్యులను స్పీకర్ కోరారు. రెండ్రోజుల విరామం తర్వాత సమావేశమైన ఇవాల్టి అసెంబ్లీలో ఎనిమిది బిల్లులు సభ ముందుకు రానున్నాయి. శుక్రవారం కొత్త రెవెన్యూ బిల్లు ఆమోదం పొందిన విషయం తెలిసిందే.