యాప్నగరం

Dalitha Bandhu: నా దగ్గర సాక్ష్యాలున్నాయ్.. మంత్రి హరీశ్ సంచలనం

దళిత బంధు పథకం నిలిపివేత హుజూరాబాద్‌లో తీవ్ర కలకలం రేపుతోంది. అందుకు బీజేపీయే కారణమని గులాబీ పార్టీ.. కాదు కమలం పార్టీ లేఖ వల్లే ఆగిపోయిందని టీఆర్‌ఎస్ దుమ్మెత్తిపోసుకుంటున్నాయి.

Samayam Telugu 20 Oct 2021, 10:29 pm
హుజూరాబాద్‌‌లో దళిత బంధు ప్రకంపనలు పుట్టిస్తోంది. ఉప ఎన్నిక వేళ దళిత బంధు పథకం అమలును నిలిపివేస్తూ ఈసీ తీసుకున్న నిర్ణయం రాజకీయంగా కలకలం రేపింది. మీ వల్లే పథకం ఆగిపోయిందంటూ అటు అధికార టీఆర్‌ఎస్.. ఇటు బీజేపీ ఒకరిపై మరొకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ఈ నెల 7న ఎన్నికల కమిషన్‌కి బీజేపీ ఇచ్చిన ఫిర్యాదు కారణంగానే దళిత బంధు ఆగిపోయిందని టీఆర్‌ఎస్ ఆరోపిస్తోంది. ఈసీ నిలిపివేస్తుందని తెలిసే దళిత బంధు తీసుకొచ్చారని.. గతంలో గొర్రెల పథకంలానే ఇది కూడా ప్లాన్‌లో భాగంగానే చేశారని బీజేపీ ఎదురుదాడికి దిగింది.
Samayam Telugu ప్రతీకాత్మక చిత్రం
harish


బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఒకడుగు ముందుకేసి టీఆర్‌ఎస్ నేతలకు సవాల్ విసిరారు. తమ లేఖలో దళిత బంధు విషయం ప్రస్తావించలేదని.. దమ్ముంటే యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి మీద ప్రమాణం చేసేందుకు సిద్ధమేనా అని సవాల్ కూడా విసిరారు. బీజేపీ నేతల సవాళ్లపై మంత్రి హరీశ్ రావు దీటుగా స్పందించారు. దళిత బంధు పథకం నిలిపివేసేందుకు ముమ్మాటికీ బీజేపీయే కారణమని ఆయన నొక్కిచెప్పారు.

తన వద్ద సాక్ష్యాలు కూడా ఉన్నాయంటూ మంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల కమిషన్‌కి బీజేపీ ఫిర్యాదు చేసిన మాట నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. దళిత బంధు ఆగేందుకు బీజేపీయే కారణమని తాను నిరూపిస్తానని హరీశ్ సవాల్ విసిరారు. ఎవరొస్తారో రావాలని.. తాను సాక్ష్యాలతో నిరూపిస్తానని ఓపెన్ చాలెంజ్ చేశారు. బీజేపీ నేతలు దళితులను మోసం చేస్తున్నారని.. వారి మాటలు నమ్మొద్దని ఆయన కోరారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.