యాప్నగరం

పాడె మోసిన మంత్రి హరీశ్ రావు.. వారికి 2 లక్షల ఆర్థిక సాయం

Doultabad: అంతిమయాత్రలో పాల్గొని హరీశ్ రావు పాడె మోశారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కూడా పాడె మోసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడారు.

Samayam Telugu 11 Nov 2020, 5:31 pm
దౌల్తాబాద్ మండలం కొనాయిపల్లికి చెందిన స్వామి దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమిని తట్టుకోలేక ఉరేసుకున్న సంగతి తెలిసిందే. విషయం తెలుసుకున్న మంత్రి హరీశ్‌రావు ఆయన గ్రామానికి చేరుకుని మృతదేహానికి నివాళులర్పించారు. అనంతరం అంతిమయాత్రలో పాల్గొని పాడె మోశారు. ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి కూడా పాడె మోసిన వారిలో ఉన్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ టీఆర్ఎస్ కార్యకర్తలందరికీ కీలక సూచనలు చేశారు.
Samayam Telugu పాడె మోస్తున్న హరీశ్ రావు
harish rao participates trs worker funeral


‘‘రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. ఓటమికి ఆత్మహత్యలు పరిష్కారం కావు. ఆత్మవిశ్వాసం తో ముందుకు పోదాం. కార్యకర్తలు అందరూ సంయమనంతో ఉండాలి. సహనం కోల్పోవద్దు. స్వామి మరణ వార్త విని ఎంతో బాధపడ్డాను. కార్యకర్తలు కూడా మనోధైర్యం కోల్పోవద్దు. టీఆరెస్ పార్టీ కార్యకర్తలను అందరిని కాపాడుకుంటుంది. మేము అందరం మీకు అండగా ఉంటాము. స్వామి చాలా చురుకైన కార్యకర్త మొన్న జరిగిన ఎన్నికల్లో రోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రచారంలో చురుకుగా పాల్గొన్నాడు’’ అని హరీశ్ గుర్తు చేశారు.

‘‘రాత్రింబవళ్లు పార్టీ కోసం కష్ట పడిన కార్యకర్త స్వామి. ఆయన కుటుంబాన్ని టీఆరెస్ పార్టీ అన్ని విధాలుగా అదుకుంటుంది. ఈ రోజు రూ.2 లక్షల తక్షణ ఆర్థిక సహాయం వారి కుటుంబానికి అందించాము. భవిష్యత్తులో కూడా స్వామి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుంది. కార్యకర్తలు అందరూ కూడా ధైర్యాన్ని సహనాన్ని కోల్పోవద్దు. స్వామి పిల్లల చదువు కూడా రెసిడెన్షియల్ స్కూల్‌లో తల్లి కోరుకున్న విధంగా చదివిపిస్తాం. స్వామి కుటుంబానికి పార్టీ పక్షాన పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ పక్షాన సంతాపం తెలియ చేస్తున్నాం’’ అని హరీశ్ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.