యాప్నగరం

నిర్మల్‌లో 150 అడుగుల ఎత్తైన భారీ జెండా.. ఆవిష్కరించిన మంత్రి

Nirmal: 14వ ఆర్థిక సంఘం నిధులతో రూ.53 లక్షల వ్యయంతో ఈ జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అతి ఎత్తైన జెండాల్లో ఇది ఒక్కటి కావడం విశేషం.

Samayam Telugu 15 Aug 2020, 4:56 pm
ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నిర్మల్ ప‌ట్టణంలో భారీ జాతీయ ప‌తాకాన్ని ఎగురవేశారు. ప‌ట్టణంలో భారీ మువ్వన్నెల జెండాను శనివారం మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి ఆవిష్కరించారు. ‌మంత్రి ఇంద్రక‌ర‌ణ్ రెడ్డి ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని ధర్మసాగర్ మినీ ట్యాంక్ బండ్ వద్ద 150 అడుగుల భారీ జాతీయ జెండాను ఏర్పాటు చేసేందుకు కృషి చేశారు. 14వ ఆర్థిక సంఘం నిధులతో రూ.53 లక్షల వ్యయంతో ఈ జాతీయ పతాకాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో అతి ఎత్తైన జెండాల్లో ఇది ఒక్కటి కావడం విశేషం. ఈ భారీ జాతీయ జెండాను ముంబయికి చెందిన బజాజ్‌ కంపెనీ రూపొందించింది.
Samayam Telugu భారీ జాతీయ జెండా
minister indrakaran reddy inagurates 150 feets height national flag


32 అడుగుల పొడవు, 48 అడుగుల వెడల్పుతో త్రివర్ణ పతాకాన్ని ముంబయిలో తయారు చేయించారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, జ‌డ్పీ ఛైర్ పర్సన్ కె.విజ‌య‌ల‌క్ష్మి, క‌లెక్టర్ ముషార‌ఫ్ ఫారూఖీ అలీ, మున్సిప‌ల్ ఛైర్మన్ గండ్రత్ ఈశ్వర్ త‌దిత‌రులు పాల్గొన్నారు.

Don't Miss Photos: తెలంగాణలో పంద్రాగస్టు వేడుకలు.. సీఎం సహా ప్రముఖుల జెండా ఆవిష్కరణ ఫోటోలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.