యాప్నగరం

‘కాబోయే సీఎం కేటీఆర్’ వార్తలపై మంత్రి ఆసక్తికర వ్యాఖ్యలు

Future CM KTR పై మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. గత వారం రోజులుగా త్వరలోనే కేటీఆర్ సీఎం అవ్వనున్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆదివారం మంత్రి మీడియాతో మాట్లాడారు.

Samayam Telugu 5 Jan 2020, 3:37 pm
మంత్రి కేటీఆర్ ముఖ్యమంత్రి కావడం తమకు ఇష్టమేనని మంత్రి కొప్పుల ఈశ్వర్ వెల్లడించారు. కేటీఆర్ సీఎం అయ్యేందుకు ఆయనకు అన్ని అర్హతలూ ఉన్నాయని, అన్ని విధాలా సమర్థుడని వ్యాఖ్యానించారు. అయితే, కేటీఆర్ సీఎం ఎప్పుడు అవుతారనే విషయం కేసీఆర్ నిర్ణయిస్తారని వెల్లడించారు. ఆదివారం మంత్రి కొప్పుల ఈశ్వర్ మీడియాతో మాట్లాడారు. గత వారం రోజులుగా త్వరలోనే కేటీఆర్ సీఎం అవ్వనున్నారనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఎర్రబెల్లి, పువ్వాడ వంటి మంత్రులు దీనిపై వ్యాఖ్యలు చేస్తున్నారు. తాజాగా మంత్రి కొప్పుల ఈశ్వర్ కూడా ఈ వ్యవహారంపై స్పందించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
Samayam Telugu koppula eshwar with KTR.


Also Read: KTR వల్ల సీఎం కేసీఆర్ ప్రాణాలకు ముప్పు.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు

కేసీఆర్ తాను అనుకున్నది ఐదేళ్లలో సాధించారని ఈశ్వర్ అన్నారు. విద్యుత్, ప్రాజెక్టులు, సంక్షేమం అనే మూడు అంశాలు కేసీఆర్‌కు లక్ష్యాలుగా ఉండేవని వివరించారు. రాష్ట్రంలో 24 గంటల పాటు కోతలు లేని విద్యుత్ ఇచ్చి దాన్ని సాధించారని అన్నారు. ఇక భారీ నీటి ప్రాజెక్ట్‌లు కట్టి 78 లక్షల ఎకరాలు ఆయకట్టు స్థిరీకరణ జరిగిందని చెప్పారు. సంక్షేమం పరంగానూ దేశంలో తెలంగాణ అగ్రస్థానంలో ఉందని.. వీటితో సీఎం కేసీఆర్ అనుకున్న లక్ష్యం నెరవేరిందని మంత్రి అభిప్రాయపడ్డారు.

Also Read: మరోసారి గొప్ప ఉదారత చాటుకున్న మంత్రి కేటీఆర్

తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్న మా కేటీఆర్ మంత్రి అయ్యాక పట్టణాభివృద్ధి పెరిగిందని ఈశ్వర్ అన్నారు. ‘‘ఎన్నో భారీ పరిశ్రమలు రాష్ట్రానికి రావడంలో కేటీఆర్ కీలక పాత్ర పోషించారు. దేశంలో ఐటీ రంగం అభివృద్ధిలో హైదరాబాద్ మొదటి స్థానంలో ఉంది. యువ న్యాయకత్వం తెలంగాణకు బాగా అవసరం. కేటీఆర్‌ను సీఎం చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిపాదిస్తే మేం కచ్చితంగా ఆమోదిస్తాం. కేటీఆర్‌ను ఇప్పుడు లేదా వచ్చే ఎన్నికల్లో ఎప్పుడు ముఖ్యమంత్రిని చేసినా మేం స్వాగతిస్తాం’ అని కొప్పుల వ్యాఖ్యలు చేశారు.

Also Read: మీకు దమ్ముంటే ముందు నన్ను చంపండి.. బీజేపీ నాయకులకు ఒవైసీ సవాల్

రాష్ట్రంలో ఎవరిని ముఖ్యమంత్రిని చేయాలనేది పార్టీ అధిష్ఠానం నిర్ణయమని, ఈ విషయంపై బీజేపీ అనవసర రాద్ధాంతం చేయడం తగదని మంత్రి విమర్శించారు. కేటీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌కు కడుపుమంట ఎందుకని ప్రశ్నించారు. పురపాలిక ఎన్నికల్లోనూ అతిగా ఊహించుకొని బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలపై అనవసర రాద్ధాంతం చేస్తోందని విమర్శించారు. ఎవరెన్ని మాటలు చెప్పినా ఎన్నికల్లో గెలుపు తమదేనని విశ్వాసం వ్యక్తం చేశారు.

Also Read: ఆర్టీసీ ఛార్జీల పెంపు: వామ్మో.. ఇంకా అదనపు బాదుడు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.