హైదరాబాద్లో ఏరోస్పేస్ యూనివర్సిటీని ఏర్పాటు చేసే ప్రయత్నాల్లో ఉన్నట్లు మంత్రి కేటీ రామారావు (KTR) తెలిపారు. రాష్ట్రంలో త్వరలో మరిన్ని ఏరోస్పేస్, డిఫెన్స్ పార్కులు ఏర్పాటవుతాయని చెప్పారు. హైదరాబాద్ నగరంలో ఏరోస్పేస్, ఏవియేషన్ ఎకోసిస్టం రోజురోజుకూ వృద్ధి చెందుతోందని.. ఏవియేషన్ మంత్రిత్వ శాఖ నుంచి నిరంతరం అవార్డులు పొందుతోందని అన్నారు. విమానాల ఇంజిన్లను తయారు చేసే ‘శాఫ్రాన్’ (Safran) సంస్థకు చెందిన ఏరోస్పేస్ ఫ్యాక్టరీని శంషాబాద్లో గురువారం (జులై 7) మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇతర ప్రపంచ స్థాయి ఏరోస్పేస్ సంస్థలు కూడా హైదరాబాద్కు వస్తాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు.
డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సెంటర్ రూపంలో శాఫ్రాన్ నుంచి తెలంగాణకు నాలుగో పెట్టుబడి కూడా రానుందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో టీఎస్ ఐపాస్ రూపంలో అద్భుత విధానం ఉందని పునరుద్ఘాటించారు. దీంతో పాటు మెగా ప్రాజెక్టులకు ప్రభుత్వం చాలా ప్రోత్సాహకాలు కల్పిస్తోందని కేటీఆర్ వివరించారు. హైదరాబాద్కు శాఫ్రాన్ రావడం అంత ఈజీగా జరగలేదని.. ఢిల్లీ, ప్యారిస్, హైదరాబాద్లో 35 సార్లు సమావేశాలు జరిగాయని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
శంషాబాద్ విమానాశ్రయంలో జీఎంఆర్ చేపట్టిన టెర్మినల్ విస్తరణ ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి పూర్తవుతుందని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లో ఎయిర్ ట్రాఫిక్ పెరుగుతోందని.. దీనికి అనుగుణంగా మరిన్ని టెర్మినల్స్ కూడా అవసరం అవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నుంచి యూరప్, యూఎస్కు మరిన్ని డైరెక్ట్ ఫ్లైట్స్ నడుపుతామన్న హమీ నెరవేర్చాలని కేంద్ర విమానయాన శాఖను కేటీఆర్ కోరారు.
‘శాఫ్రాన్ గ్రూప్ ఆధ్వర్యంలో మూడో అతిపెద్ద అంతర్జాతీయ స్థాయి ఫెసిలిటీ సెంటర్ను తెలంగాణలో ప్రారంభించడం సంతోషకరం. ఈ ప్రాజెక్టుకు జాతీయంగా ఎంతో ప్రాధాన్యం ఉంది. హైదరాబాద్ దేశంలో ఉత్తమ ఏరోస్పేస్ వ్యాలీగా మారుతోంది’ అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, శాఫ్రాన్ కంపెనీ ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Also Read:
పెన్ను పోయిందంటూ ఎంపీ ఫిర్యాదు.. దాని విలువ తెలిస్తే షాకవుతారు
డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సెంటర్ రూపంలో శాఫ్రాన్ నుంచి తెలంగాణకు నాలుగో పెట్టుబడి కూడా రానుందని కేటీఆర్ తెలిపారు. తెలంగాణలో టీఎస్ ఐపాస్ రూపంలో అద్భుత విధానం ఉందని పునరుద్ఘాటించారు. దీంతో పాటు మెగా ప్రాజెక్టులకు ప్రభుత్వం చాలా ప్రోత్సాహకాలు కల్పిస్తోందని కేటీఆర్ వివరించారు. హైదరాబాద్కు శాఫ్రాన్ రావడం అంత ఈజీగా జరగలేదని.. ఢిల్లీ, ప్యారిస్, హైదరాబాద్లో 35 సార్లు సమావేశాలు జరిగాయని కేటీఆర్ చెప్పుకొచ్చారు.
శంషాబాద్ విమానాశ్రయంలో జీఎంఆర్ చేపట్టిన టెర్మినల్ విస్తరణ ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి పూర్తవుతుందని కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లో ఎయిర్ ట్రాఫిక్ పెరుగుతోందని.. దీనికి అనుగుణంగా మరిన్ని టెర్మినల్స్ కూడా అవసరం అవుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ నుంచి యూరప్, యూఎస్కు మరిన్ని డైరెక్ట్ ఫ్లైట్స్ నడుపుతామన్న హమీ నెరవేర్చాలని కేంద్ర విమానయాన శాఖను కేటీఆర్ కోరారు.
‘శాఫ్రాన్ గ్రూప్ ఆధ్వర్యంలో మూడో అతిపెద్ద అంతర్జాతీయ స్థాయి ఫెసిలిటీ సెంటర్ను తెలంగాణలో ప్రారంభించడం సంతోషకరం. ఈ ప్రాజెక్టుకు జాతీయంగా ఎంతో ప్రాధాన్యం ఉంది. హైదరాబాద్ దేశంలో ఉత్తమ ఏరోస్పేస్ వ్యాలీగా మారుతోంది’ అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, శాఫ్రాన్ కంపెనీ ప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Also Read:
పెన్ను పోయిందంటూ ఎంపీ ఫిర్యాదు.. దాని విలువ తెలిస్తే షాకవుతారు