యాప్నగరం

బండి సంజయ్‌పై పరువు నష్టం దావా వేసిన కేటీఆర్

మంత్రి కేటీఆర్‌పై ఆరోపణలు గుప్పించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు లీగల్ నోటీసులు జారీ అయ్యాయి. 48 గంటల్లోగా బేషరతుగా క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ న్యాయవాది.. ఈ మేరకు నోటీసులు పంపించారు.

Authored byAshok Krindinti | Samayam Telugu 13 May 2022, 5:30 pm
టీఆర్ఎస్, బీజేపీల మధ్య మాటల యుద్ధం లీగల్ నోటీసుల వరకు చేరింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా కేసు వేశారు. తన న్యాయవాది చేత బండి సంజయ్‌కి కేటీఆర్ నోటీసులు పంపించారు. ఈ నెల 11న ట్వీట్టర్‌లో తనపై బండి సంజయ్ చేసిన ఆరోపణలకు ఆధారాలు ఉంటే నిరూపించాలని.. లేకపోతే బహిరంగ క్షమాపణ కోరాలని చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే. లేకపోతే పరువు నష్టం దావా కేసు వేస్తానని హెచ్చరించారు.
Samayam Telugu బండి సంజయ్‌కు కేటీఆర్ నోటీసులు


బండి సంజయ్ నుంచి ఎలాంటి రిప్లై రాకపోవడంతో కేటీఆర్ న్యాయవాది శుక్రవారం నోటీసులు జారీ చేశారు. మంత్రి కేటీఆర్ పాపులారిటీని దృష్టిలో ఉంచుకుని.. ఆయనపై నిరాధార పూరితమైన ఆరోపణలు చేసి ప్రచారం పొందాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్ అబద్ధాలు చెప్పారని నోటీసులో న్యాయవాది పేర్కొన్నారు. జాతీయస్థాయి పార్టీకి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్.. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని కేటీఆర్‌కి ఆపాదించే ప్రయత్నం చేశారని అన్నారు.

మంత్రి కేటీఆర్ పరువుకు కలిగించేలా, అసత్య పూరిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ సివిల్, క్రిమినల్ చట్టాల ప్రకారం.. మంత్రి కేటీఆర్‌కి పరిహారం చెల్లించడంతో పాటు చట్టప్రకారం తగిన చర్యలకు అర్హులవుతారని న్యాయవాది చెప్పారు. 48 గంటల్లో కేటీఆర్‌కి బేషరతులు లేకుండా క్షమాపణ చెప్పాలన్న న్యాయవాది నోటీసులు పేర్కొన్నారు.

Also Read:

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.