యాప్నగరం

మతకల్లోలాలు, బాంబు పేలుళ్లు లేవు.. మీట్‌ ది ప్రెస్‌లో కేటీఆర్

లా అండ్ ఆర్డర్ విషయంలో ప్రభుత్వం రాజీపడేది లేదన్నారు. మతసామరస్యాన్ని దెబ్బతీస్తే ఊరుకునేది లేదన్నారు. విద్వేషపూరిత విత్తనాలు నాటేప్రయత్నం కొందరు చేస్తున్నారన్నారు.

Samayam Telugu 19 Nov 2020, 12:00 pm
ఆరేళ్ల కిందట తెలంగాణపై అనేక అసత్య ప్రచారాలు జరిగాయన్నారు. కానీ ఇప్పుడు దేశమంతా హైదరాబాద్‌ వైపే చూస్తుందన్నారు. హైదరాబాద్‌కు పెట్టుబడులే రావన్నారు.. తెలంగాణ వసతే అంతా చీకటి అయిపోతుందన్నారు. మొత్తం అంధకారం వస్తుందని ఆరోపణలు చేశారన్నారు. ఉన్న కంపెనీలు తరలిపోతాయని విమర్శలు చేశారు. కానీ విద్యుత్ లోటు నుంచి విద్యుత్ మిగులు ఉన్న రాష్ట్రంగా నేడు తెలంగాణ మారిందన్నారు. కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ ఎంతగానో అభివృద్ధి చెందిందన్నారు.
Samayam Telugu మంత్రి కేటీఆర్


Read More: Bandi Sanjay: వరద సాయం ఆపాలని బండి సంజయ్ లేఖ.. పోలీసులకు ఫిర్యాదు

కేసీఆర్ నాయకత్వంలో ఇవాళ హైదరాబాద్‌లో గుడుంబా గబ్బు.. పేకాట క్లబ్బులు లేవన్నారు. మతకల్లోలాలు, బాంబు పేలుళ్లు, కర్ఫ్యూలు లేవన్నారు. పోకిరీల ఆకతాయిల అల్లర్లకు అడ్డుకట్ట వేశామన్నారు. గిల్లి కజ్జాలు లేకుండా పటిష్టమైన కార్యాచరణతో ముందుకు వెళ్లడం వల్లే ఇది సాధ్యమైందన్నారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక ఎన్నో మార్పులు జరిగాయన్నారు. నగరంలో రోడ్ల నిర్మాణం కోసం ఎస్ఆర్డీపీ ప్రాజెక్టులతో ముందుకు వెళ్లామన్నారు. అండర్ పాస్‌ల నిర్మాణం జరిగిందన్నారు. ఆరేళ్లపై ప్రజలపై ఒక్క పైసా భారం కూడా వేయలేదన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.