యాప్నగరం

లాక్‌డౌన్ వేళ మంత్రి కేటీఆర్ మరో కీలక నిర్ణయం

KTR: పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. గురువారం నుంచి గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని 150 అన్నపూర్ణ కేంద్రాల వద్ద ఇకపై పేదలకు ఉచితంగానే భోజనాన్ని అందించనున్నట్లుగా ప్రకటించారు.

Samayam Telugu 26 Mar 2020, 5:50 pm
తెలంగాణలో ప్రస్తుతం అమలవుతున్న లాక్‌డౌన్‌ ప్రభావంతో మంత్రి కేటీఆర్, హైదరాబాద్ మహా నగర పాలక సంస్థ (జీహెచ్‌ఎంసీ) మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. తొలుత లాక్‌డౌన్ సందర్భంగా హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో ఉన్న అన్నపూర్ణ కేంద్రాలను సైతం మూసేయాలని అనుకున్నారు. కానీ తర్వాతి పరిస్థితుల వల్ల పేదల ఆకలి తీర్చేందుకు రూ.5కే భోజనం అందించే అన్నపూర్ణ కేంద్రాలను యథావిధిగా కొనసాగించాలని నిర్ణయించారు. కానీ, మరో అడుగు ముందుకేసి లాక్ డౌన్ ప్రబావం ఉన్నన్నినాళ్లు ఇప్పుడు ఆ కేంద్రాల్లో ఉచితంగా భోజనం అందజేయాలని నిర్ణయం తీసుకున్నారు.
Samayam Telugu B91BB5CE-33F2-4D98-A1BB-1FFC7ED08967


Must Read: కరోనా కష్టాలు అప్పటివరకూ తప్పవా.. పంచాంగంలో ఏముందంటే..

పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ ఆదేశాల మేరకు మేయర్‌ బొంతు రామ్మోహన్‌ ఈ నిర్ణయం తీసుకున్నారు. గురువారం నుంచి గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని 150 అన్నపూర్ణ కేంద్రాల వద్ద ఇకపై పేదలకు ఉచితంగానే భోజనాన్ని అందించనున్నట్లుగా ప్రకటించారు. లాక్‌డౌన్‌ వల్ల రోజూవారి కూలీలు సహా మరెవరూ ఆకలితో ఉండిపోవద్దనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు మేయర్ బొంతు రామ్మోహన్ చెప్పారు. హాస్టళ్లలోనే ఉండిపోయిన వారు, ఇతరులకు కూడా జీహెచ్‌ఎంసీ తరపున ఉచితంగా భోజన సదుపాయం కల్పిస్తామని చెప్పారు.

Must Read: ఆపదలో ఆంధ్రా చెల్లి.. మంత్రి కేటీఆర్ అన్న అభయం.. ఎంతో మందికి భరోసా

మరోవైపు, లాక్ డౌన్ వల్ల కొన్ని చోట్ల ప్రజలు రైతు బజార్లకు వెళ్లేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సరకులు, కూరగాయల వంటివి కాలనీలకే పంపడానికి ఏర్పాట్లు చేస్తోంది. గురువారం నుంచే కూరగాయల సరఫరాకు కొన్ని వాహనాలను ప్రవేశపెట్టింది. వీలును బట్టి నిత్యావసరాలను కూడా ఇళ్ల వద్దకే పంపాలని అధికారులు భావిస్తున్నారు. రైతుబజార్లలో సామాజిక దూరం పాటించనందున కాలనీలకు కూరగాయల విక్రయ వాహనాలు పంపాలని నిర్ణయించారు.

Also Read: జనం కరోనా కష్టాలు.. చలించిపోయిన మంత్రులు హరీశ్, కేటీఆర్

Read Also: తెలంగాణలో డాక్టర్ జంటకు కోవిడ్.. 44కు పెరిగిన కేసులు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.