యాప్నగరం

ఆయన సీఎం కావాలి.. బోధన్ ఎమ్మెల్యే ఆసక్తికర వ్యాఖ్యలు

స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే షకీల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ సీఎం కావాలని ఆయన ఆకాక్షించారు. ముఖ్యమంత్రి కావడానికి అన్ని అర్హతలు కేటీఆర్‌‌కు ఉన్నాయన్నారు.

Samayam Telugu 15 Aug 2020, 1:10 pm
నిజామాబాద్: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా బోధన్ ఎమ్మెల్యే షకీల్ కీలక వ్యాఖ్యలు చేశారు. యువ నాయకుడు, మంత్రి కేటీఆర్‌ను సీఎం చేయాలని.. ముఖ్యంత్రి కావడానికి అన్ని అర్హతలు కేటీఆర్‌కు ఉన్నాయని షకీల్ వ్యాఖ్యానించారు. కేటీఆర్‌కు త్వరలోనే పట్టాభిషేకం జరగనుందని వార్తలు వెలువడుతున్న తరుణంలో టీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
Samayam Telugu bodhan mla shakil


ఇటీవల కేసీఆర్ సూచనల మేరకు కేటీఆర్ నేతృత్వంలో కేబినెట్ సమావేశం జరిగిన సంగతి తెలిసిందే. 8 గంటలపాటు సుదీర్ఘంగా మంత్రివర్గ సమావేశం జరిగింది. కేటీఆర్‌ను సీఎం చేయడానికి ఇది ట్రయల్ రన్ అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత సీఎం లేకుండా కేబినెట్ భేటీ నిర్వహించడం ఇదే తొలిసారి కావడం అందర్నీ ఒకింత ఆశ్చర్యానికి గురి చేసింది. కరోనా లేకపోయి ఉంటే.. కేసీఆర్ ఇప్పటికే కేటీఆర్‌ను సీఎం పీఠంపై కూర్చోబెట్టేవారనే అభిప్రాయమూ వ్యక్తమైంది. తాజాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలతో కేటీఆర్‌కు సీఎం పగ్గాలు అప్పగించడం అనే అంశం మరోసారి చర్చకు వచ్చింది.

కాగా మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇప్పుడు కేటీఆర్ సీఎం కావాలని డిమాండ్ చేసిన బోధన్ ఎమ్మెల్యే దాదాపు ఏడాది క్రితం బీజేపీ నేత, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ భేటీలో నేతలిద్దరూ రాజకీయాలపై చర్చించారు. మంత్రి పదవి రాకపోవడంతోనే షకీల్.. అర్వింద్‌ను కలిశారని.. ఆయన బీజేపీలో చేరతారని ప్రచారం జరిగింది. కానీ తాను బీజేపీలో చేరడం లేదని ఎమ్మెల్యే వివరణ ఇచ్చారు. కేసీఆర్ తనకు గాడ్ ఫాదర్ అని.. జీవితాంతం ఆయనకు రుణపడి ఉంటానన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.