యాప్నగరం

ఐస్‌క్రీం తినేందుకు ఇటు వచ్చేవాళ్లం.. స్మృతులను గుర్తుచేసుకున్న కేటీఆర్

KTR: ఎంజే మార్కెట్ పునఃప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. 1935లో నిర్మించిన ఎంజే మార్కెట్‌ను రూ.15 కోట్లతో ప్రస్తుతం ప్రభుత్వం పునరుద్ధరించిందని అన్నారు.

Samayam Telugu 14 Aug 2020, 10:26 pm
హైదరాబాద్‌లో పురాతన కట్టడాల్లో ఒకటైన మొజంజాహి మార్కెట్‌ను శుక్రవారం మంత్రి కేటీఆర్ పునఃప్రారంభించారు. 1935లో నిర్మించిన ఈ ఎంజే మార్కెట్‌ను మళ్లీ 85 ఏళ్ల తర్వాత రీమోడలింగ్ పనులు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్‌తో పాటు మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ, రాజ్యసభ సభ్యుడు కేకే, మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొన్నారు.
Samayam Telugu ఎంజే మార్కెట్ ప్రారంభోత్సవంలో కేటీఆర్
KTR Inagurates mozamjahi market


మొజంజాహి మార్కెట్ పునఃప్రారంభోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి కేటీఆర్ మాట్లాడారు. 1935లో నిర్మించిన మొజంజాహి మార్కెట్‌ను రూ.15 కోట్లతో ప్రస్తుతం ప్రభుత్వం పునరుద్ధరించిందని అన్నారు. అప్పట్లో తాము ఇక్కడకి ఐస్ క్రీమ్ కోసం వచ్చేవాళ్లమని కేటీఆర్ గత స్మృతులను గుర్తు చేసుకున్నారు. చారిత్రక సంపదను పరిరక్షించడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ముందుకు వెళుతుందని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. హైదరాబాద్‌కు యునెస్కో గుర్తింపు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.

Don't Miss: undefined

Don't Miss: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.