యాప్నగరం

ఈటల రాజేందర్ చేసిన తప్పు అదే.. మంత్రి KTR ఆసక్తికర వ్యాఖ్యలు

TRS Party: బండి సంజయ్ గురించి విమర్శలు చేస్తూ.. ఆయన అసలు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. ఏడేళ్లలో కేంద్రం దేశంలో ఏం చేసిందో చెప్పే ధైర్యం బీజేపీ నేతలకు ఉందా? అని ప్రశ్నించారు.

Samayam Telugu 14 Jul 2021, 3:00 pm
ఈటల రాజేందర్ గురించి టీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈటల రాజేందర్ టీఆర్ఎస్‌లో ఉన్నప్పుడు ఎలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో కేటీఆర్ ప్రస్తావించారు. ఈటలకు టీఆర్ఎస్ పార్టీ ఎలాంటి నష్టం చేయలేదని అన్నారు. 2003లో ఈటల రాజేందర్‌కు ఎంత కష్టమైనా సరే పార్టీ టికెట్ ఇచ్చిందని చెప్పారు. టీఆర్ఎస్‌లో పదవులు అనుభవిస్తూ ఇతర పార్టీల నేతలతో ఈటల సంప్రదింపులు జరిపారని ఆరోపించారు. మంత్రివర్గ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆ భేటీలో మాట్లాడితే సరిపోయేదని.. కానీ, ఆయన అలా చేయలేదని అన్నారు.
Samayam Telugu కేటీఆర్ (ఫైల్ ఫోటో)
ktr with mask


ప్రజల్లో సానుభూతి కోసం వారి మధ్యలో మాట్లాడి ఆయనకు ఆయనే దూరమయ్యారని కేటీఆర్ చెప్పారు. హుజూరాబాద్‌లో పార్టీల మధ్యనే పోటీ ఉందని.. వ్యక్తుల మధ్య కాదని కేటీఆర్ అన్నారు. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమని విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ గురించి విమర్శలు చేస్తూ.. ఆయన అసలు పాదయాత్ర ఎందుకు చేస్తున్నారో చెప్పాలని కేటీఆర్ ప్రశ్నించారు. ఏడేళ్లలో కేంద్రం దేశంలో ఏం చేసిందో చెప్పే ధైర్యం బీజేపీ నేతలకు ఉందా? అని ప్రశ్నించారు. చిల్లర రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్‌గా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. నిరుద్యోగ సమస్యపై తప్ప ప్రతిపక్షాలు మాట్లాడేందుకు ఎలాంటి విషయం లేదని కేటీఆర్ విమర్శించారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.