యాప్నగరం

Telangana Lockdown Extension: ఆ పని చేస్తే భవిష్యత్తులో మనల్ని మనం క్షమించుకోలేం

Lockdown in Telangana: నూతన ఐసోలేషన్‌ వార్డులు, వైద్య సామగ్రిని సిద్ధం చేయడం, మాస్కులు మరిన్ని ఆస్పత్రుల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో 15 వేల పడకలను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు.

Samayam Telugu 8 Apr 2020, 10:46 am
కరోనా వైరస్‌ పూర్తి కట్టడికి ప్రస్తుత దేశ వ్యాప్త లాక్‌డౌన్‌‌ను కొనసాగించడమే సరైన చర్య అని మంత్రి కేటీఆర్ అభిప్రాయపడ్డారు. వైరస్ వ్యాప్తి ఆగిన తర్వాతే లాక్‌ డౌన్‌‌ను ఎత్తేయాలని సూచించారు. ఆర్థిక ప్రగతి కన్నా ప్రజల ప్రాణాలే తమకు ముఖ్యమని, అదే ప్రభుత్వ తొలి ప్రాధాన్యం అని చెప్పారు. కరోనాను అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఎదుర్కోలేకపోతున్నాయని గుర్తు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. కరోనా విషయంలో ఇప్పుడు లాక్ డౌన్ ఎత్తేస్తే అది పొరపాటు అవుతుందని, దీనికి భవిష్యత్‌లో మనల్ని మనం క్షమించుకోలేమని అన్నారు. ప్రజలు ఆరోగ్యంగా ఉంటే ఇప్పటికంటే ఎక్కువ కష్టపడి ప్రగతి సాధించొచ్చని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.
Samayam Telugu KTR sad image


130 కోట్ల జనాభా ఉన్న దేశంలో అందరికీ కరోనా పరీక్షల నిర్వహణ ఆచరణ సాధ్యం కాదని మంత్రి అభిప్రాయడ్డారు. విచ్చలవిడిగా పరీక్షలు చేస్తే అసలైన రోగులకు అవకాశం ఉండకపోవచ్చని అన్నారు. కరోనాను ఎదుర్కొనేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని విధాలుగా సిద్ధంగా ఉందని అన్నారు. అవసరమైన సౌకర్యాలు, వైద్య సామగ్రిని సిద్ధం చేసినట్లు తెలిపారు. తెలంగాణలో హాట్‌స్పాట్‌ ప్రాంతాల్లో కరోనా పరీక్షల సామర్థ్యాన్ని మరింత పెంచాల్సి ఉందన్నారు.

Must Read: హైదరాబాద్‌లో కరోనా కారు చక్కర్లు.. అప్పుడు కండోమ్ బైక్ కూడా..

15 వేల పడకలు..
నూతన ఐసోలేషన్‌ వార్డులు, వైద్య సామగ్రిని సిద్ధం చేయడం, మాస్కులు మరిన్ని ఆస్పత్రుల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో 15 వేల పడకలను సిద్ధం చేస్తున్నట్లు చెప్పారు. లాక్‌ డౌన్‌లో నేపథ్యంలో రాష్ట్రంలో ఒక్క ఆకలి చావు లేకుండా చూడాలన్న లక్ష్యంతో ప్రభుత్వం పనిచేస్తున్నట్లు తెలిపారు. పేదలు, వలస కార్మికుల సంక్షేమంలో తెలంగాణ మార్గదర్శిగా ఉందని చెప్పారు. ఇంటి అద్దెల కోసం ఓనర్లు బలవంతపెట్టకుండా తగిన మార్గదర్శకాలు జారీ చేసినట్లు మంత్రి పేర్కొన్నారు.

Also Read: సీఎం బుర్ర లేకుండా మాట్లాడొద్దు.. రేవంత్ సంచలన వ్యాఖ్యలు

జూన్‌ మొదటి వారంలో కరోనా వ్యాప్తిలో దేశం అగ్రస్థాయికి చేరుకొనే అవకాశం ఉందని నివేదికలు చెబుతున్నాయని మంత్రి గుర్తు చేశారు. పరిశ్రమలను ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ప్రైవేట్‌ ఉద్యోగులకు వేతనాలు ఇవ్వాలని సంస్థలకు సూచించినట్లు చెప్పారు.

Must Read: హైదరాబాద్‌లో కరోనా కారు చక్కర్లు.. అప్పుడు కండోమ్ బైక్ కూడా..

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.