యాప్నగరం

KTR: ప్రధాని, అదానీ ఎందుకీ మౌనం.. శ్రీలంక అధికారులు టార్గెట్ చేస్తుంటే స్పందించరా?: కేటీఆర్

ప్రధాని నరేంద్ర మోదీని మరోసారి టార్గెట్ చేస్తూ టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు. ముందుగా కేంద్రం 10 లక్షల ఉద్యోగాల ప్రకటనపై సెటైర్లు వేసిన ఆయన.. తాజాగా శ్రీలంక అధికారుల ఆరోపణలు ఎందుకు మౌనం వహించారంటూ ప్రధాని మోదీని ప్రశ్నించారు.

Authored byRaj Kumar | Samayam Telugu 16 Jun 2022, 3:10 pm
ప్రధాని నరేంద్ర మోదీపై వరుస ట్వీట్లతో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విరుచుకుపడుతున్నారు. కేంద్రం ప్రకటించిన 10 లక్షల ఉద్యోగాలపై ముందుగా విమర్శలు గుప్పించిన ఆయన.. అనంతరం శ్రీలంక అధికారుల ఆరోపణలపై మోదీ, అదానీ ఎందుకు స్పందిచడం లేదంటూ మరో ట్వీట్ చేశారు. ‘దేశవ్యాప్తంగా ఉన్న ప్రతిపక్ష నాయకులను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ), సీబీఐ, ఐటీ టార్గెట్ చేయడం సర్వసాధారణమే. కానీ, శ్రీలంక ప్రభుత్వ అధికారులు విండ్ పవర్ (పవన విద్యుత్) కాంట్రాక్టులపై ప్రధాని మోదీని టార్గెట్ చేస్తే.. ప్రధాని, అదానీ ఎందుకు స్పందించడం లేదు’ అని ప్రశ్నిస్తూ ట్వీట్‌ చేశారు. ఈ విషయంలో మీడియా కూడా నిశ్శబ్దం వహిస్తోందని కేటీఆర్ విమర్శించారు.
Samayam Telugu Ktr on Modi



కాగా, శ్రీలంకలోని మన్నార్‌ జిల్లాలో నిర్మించ తలపెట్టిన 500 మెగావాట్ల విండ్‌ పవర్‌ప్లాంటును పోటీ లేకుండా అదానీ గ్రూప్‌నకు కట్టబెట్టాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ, శ్రీలంక అధ్యక్షుడు గొటబాయ రాజపక్సపై ఒత్తిడి తెచ్చారని ఆ దేశ విద్యుత్ సంస్థ అధ్యక్షుడిగా పనిచేసిన ఎంఎంసీ ఫెర్డినాండో బయటపెట్టారు. ఆనాటి నుంచి లంకేయులు అదానీ గ్రూప్‌నకు వ్యతిరేకంగా నిరసనలు తెలుపుతున్నారు. సామాజిక మాధ్యమాల వేదికగా చేసుకొని లంక ప్రజలు దీనిపై పెద్ద ఉద్యమమే చేస్తున్నారు.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.