యాప్నగరం

కరోనా చికిత్సలో కార్పొరేట్ ఆస్పత్రుల దోపిడీ.. రంగంలోకి మంత్రి కేటీఆర్

Hyderabad: బడా ఆస్పత్రుల దోపిడీకి గురైన ఓ బాధితుడు సోషల్ ‌మీడియాలో మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ ఆయనకు ఫిర్యాదు చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు.

Samayam Telugu 30 Jul 2020, 2:44 pm
కరోనా సమయంలో బాధితుల నుంచి ప్రైవేటు ఆస్పత్రులు రూ.లక్షలు ఫీజు దండుకుంటున్న వ్యవహారంపై మంత్రి కేటీఆర్ స్పందించారు. కార్పొరేట్ ఆస్పత్రుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బడా ఆస్పత్రుల దోపిడీకి గురైన ఓ బాధితుడు సోషల్ ‌మీడియాలో మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేస్తూ ఆయనకు ఫిర్యాదు చేశారు. దీనిపై మంత్రి కేటీఆర్‌ స్పందించారు. కరోనా సమయంలో ప్రైవేట్ ఆస్పత్రుల దోపిడీ దుర్మార్గమని, వాటి తీరు సిగ్గుచేటని మండిపడ్డారు. బాధ్యతారహితంగా వ్యవహరిస్తున్న ప్రైవేటు ఆస్పత్రులపై వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి కేటీఆర్‌ ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేంద్రర్‌ను ట్విటర్‌లో కోరారు.
Samayam Telugu కేటీఆర్ (ఫైల్ ఫోటో)
Minister KTR


ఇటీవల తన పుట్టినరోజు సందర్భంగా మంత్రి కేటీఆర్ తన నుంచి ఆరు ఆంబులెన్స్‌ను విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వానికి ప్రకటించిన ఈ ఆరు కొవిడ్‌ రెస్పాన్స్‌ అంబులెన్స్‌లను కేటీఆర్‌ గురువారం అందజేశారు. ప్రగతిభవన్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో కలిసి కేటీఆర్‌ జెండా ఊపి వాహనాలను ప్రారంభించారు. మంత్రులు, ఎమ్మెల్యేలతోపాటు కేటీఆర్‌ భార్య శైలిమ, కుమార్తె అలేఖ్య కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.Must Read:undefined

మరోవైపు కేటీఆర్‌ స్ఫూర్తితో ఇప్పటికే పలువురు టీఆర్ఎస్ నేతలు అంబులెన్స్‌లు ఇచ్చేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. త్వరలోనే వాటన్నింటినీ కూడా ప్రారంభిస్తామని మంత్రులు, ఎమ్మెల్యేలు ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం ఉన్న కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ అంబులెన్స్‌లను కొవిడ్‌ రెస్పాన్స్‌ వాహనాలుగా వాడనున్నారు.Must Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.