యాప్నగరం

Minister KTR: మంత్రి కేటీఆర్ సింప్లిసిటీ.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సామాన్యుడిలా క్యూలో.. నెటిజన్లు ఫిదా

Minister KTR: మంత్రి కేటీఆర్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. యూకే పర్యటనకు బయల్దేరిన కేటీఆర్.. శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో సాధారణ ప్రయాణికులతో కలిసి క్యూలో నిల్చున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది.

Authored byవెంకట్రావు లేళ్ల | Samayam Telugu 10 May 2023, 1:49 pm

ప్రధానాంశాలు:

  • యూకే పర్యటనకు బయల్దేరిన మంత్రి కేటీఆర్
  • శంషాబాద్ ఎయిర్‌పోర్టులో క్యూలో నిల్చున్న మంత్రి
  • కేటీఆర్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu ktr
కేటీఆర్
Minister KTR: తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ యూకే పర్యటనకు వెళ్లారు. ఇవాళ వేకుమజామున శంషాబాద్ ఎయిర్‌పోర్ట్ నుంచి యూకేకు వెళ్లారు. తెలంగాణ రాష్ట్రానికి మరిన్ని పెట్టుబడులను తీసుకురావాలనే లక్ష్యంతో యూకే పర్యటనకు వెళ్లినట్లు తెలుస్తోంది. ఈ నెల 13వ తేదీ వరకు కేటీఆర్ యూకేలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా యూకేలోని పారిశ్రామిక దిగ్గజ సంస్థలతో పాటు వ్యాపార, వాణిజ్య సంఘాలతో సమావేశం కానున్నారు.
తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పెట్టుబడుల అనుకూల వాతావరణాన్ని కంపెనీల ప్రతినిధులను వివరించనున్నారు. యూకేకు వెళ్లేందుకు ఉదయం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు కేటీఆర్ వచ్చారు. ఈ సందర్భంగా నిరాడంబరత ప్రదర్శించారు. చెకింగ్ సమయంలో సామాన్యునిగా క్యూలైన్‌లో నిలబడ్డారు. సాధారణ ప్రయాణికులతో కలిసి క్యూలో నిలబడి చెకింగ్ ప్రక్రియను పూర్తి చేసుకున్నారు. చెకింగ్ పూర్తయిన అనంతరం ఎయిర్‌పోర్ట్‌ లోపలికి కేటీఆర్ వెళ్లారు. ఈ సందర్భంగా కేటీఆర్‌తో సెల్ఫీలు దిగేందుకు ప్రయాణికులు పోటీ పడ్డారు.

కేటీఆర్‌ తమతో పాటు కలిసి క్యూలో నిలబడటంతో ప్రయాణికులు ఆసక్తిగా చూశారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో కేటీఆర్ వెంట ఆయన సిబ్బంది పలువురు ఉన్నారు. కేటీఆర్ అభిమానులు, బీఆర్ఎస్ శ్రేణులు ఈ వీడియోను సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. 'వరుస తప్పని అ"సామాన్యుడు. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో కేసీఆర్ నిరాడంబరం. సామాన్యునిగా క్యూలైన్‌లో నిలబడి ఆదర్శంగా నిలిచారు' అంటూ పోస్టులు పెడుతున్నారు.

కేటీఆర్ రాష్ట్ర మంత్రి కావడంతో ఎయిర్‌పోర్టులో ప్రొటోకాల్ ఉంటుంది. వీఐపీ ప్రొటోకాల్ ప్రకారం కేటీఆర్‌ను సెక్యూరిటీ సిబ్బంది ప్రత్యేక ప్రవేశ ద్వారం గుండా లోపలికి అనుమతిస్తారు. కానీ కేటీఆర్ ప్రొటోకాల్ ఉపయోగించుకోకుండా సాధారణ ప్రయాణికులతో కలిసి క్యూలో నిల్చొని లోపలికి వెళ్లారు. కాగా గత ఏడాది మే 18 నుంచి 22వ తేదీ వరకు లండన్‌లో కేటీఆర్ పర్యటించారు. ఈ సందర్భంగా కంపెనీల ప్రతినిథులతో చర్చలు జరిపారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని వారికి సూచించారు. కేటీఆర్ సూచనతో పలు కంపెనీలు తెలంగాణలో పెట్టబడులు పెట్టేందుకు ముందుకొచ్చాయి.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
వెంకట్రావు లేళ్ల
వెంకట్రావు లేళ్ల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన తాజా వార్తలు, పొలిటికల్ అప్‌డేట్స్, పొలిటికల్ అనాలసిస్ అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 8 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో రాజకీయ, క్రీడా, సినిమా రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.