యాప్నగరం

ఫార్మాసిటీ అవసరాన్ని కేంద్రం గుర్తించింది.. మాది ట్రిపుల్ ఐ నినాదం: కేటీఆర్

KTR: భారత ఫార్మా ఉత్పత్తుల్లో హైదరాబాద్‌ నగరంలోనే 35 శాతం తయారవుతున్నాయని కేటీఆర్ తెలిపారు. హైదరాబాద్‌లో బయో ఆసియా 2020 సదస్సులో మాట్లాడుతూ కేలక వివరాలు వెల్లడించారు.

Samayam Telugu 17 Feb 2020, 10:09 pm
టెక్నాలజీ, లైఫ్‌ సైన్సెస్‌ రంగాల్లో తెలంగాణ రాష్ట్రం రాణిస్తోందని ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. భారత దేశ ఫార్మా ఉత్పత్తుల్లో హైదరాబాద్‌ నగరం నుంచే 35 శాతం తయారవుతున్నాయని ఆయన తెలిపారు. హైదరాబాద్‌ హెచ్‌ఐసీసీలో సోమవారం (ఫిబ్రవరి 17) సాయంత్రం జరిగిన బయో ఆసియా సదస్సుకు కేటీఆర్‌ ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్ర ప్రభుత్వం ‘ట్రిపుల్‌ ఐ’ నినాదంతో ముందుకెళుతోందని కేటీఆర్‌ తెలిపారు. ఆ మూడు ‘ఐ’లు ఇన్నోవేషన్‌, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌, ఇన్‌క్లూజివ్‌ గ్రోత్‌‌గా అభివర్ణించారు.
Samayam Telugu bio


హైదరాబాద్‌లో ఫార్మాసిటీ అవసరాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించిందని కేటీఆర్ చెప్పారు. అందుకే కేంద్రం నుంచి అన్ని అనుమతులు వచ్చాయని వివరించారు. హైదరాబాద్‌లో 276 ఎకరాల్లో వైద్య పరికరాల పార్కు ఏర్పాటైందని.. రెండేళ్ల వ్యవధిలో 20 సంస్థలు ఉత్పత్తులు ప్రారంభించాయని వెల్లడించారు. రాష్ట్రంలో పరిశ్రమలకు మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం దృష్టి సారించిందని కేటీఆర్ చెప్పారు.

బయో ఆసియా సదస్సు అంతర్జాతీయంగా హైదరాబాద్‌కు ప్రత్యేక గుర్తింపు తీసుకొస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. సదస్సుకు 37 దేశాల నుంచి 800 కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు. రెండు వేల మంది ప్రతినిధులు పాల్గొన్నారు. వీటిలో 75 స్టార్టప్ కంపెనీలు ఉన్నాయి. ‘రేపటి కోసం ఈరోజు (టుడే ఫర్ టుమారో)’ నినాదంతో కొనసాగుతున్న ఈ సదస్సు 3 రోజుల పాటు జరుగనుంది.

Also Read: పెద్దమ్మ గుడిలో కల్వకుంట్ల హిమాన్షు ప్రత్యేక పూజలు

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.