యాప్నగరం

ఫిబ్రవరిలోనే కేటీఆర్ పట్టాభిషేకం.. అంతేకాదు మరో ట్విస్ట్, సీనియర్ మంత్రి వ్యాఖ్యలు!

తెలంగాణ సీఎం మార్పు ఖాయమంటూ జోరుగా ప్రచారం సాగుతోంది. వచ్చే నెలలోనే కేటీఆర్‌కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగిస్తారని, ముహూర్తం కూడా ఫిక్సయ్యిందని సమాచారం.

Samayam Telugu 20 Jan 2021, 4:49 pm
తెలంగాణలో సీఎం మార్పుపై జోరుగా ప్రచారం జరుగుతోంది. కేసీఆర్ స్థానంలో ఆయన తనయుడు కేటీఆర్ ముఖ్యమంత్రి పీఠంపై కూర్చుంటారనే ప్రచారం ఊపందుకుంది. వచ్చే నెలలో కేటీఆర్‌కు సీఎం పగ్గాలు అప్పగించడం ఖాయమనే టాక్ నడుస్తోంది. ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, మంత్రులు సైతం ఈ వాదనను తెరపైకి తెస్తుండటం గమనార్హం. కేటీఆర్ సీఎం అయితే తప్పేంటని మంత్రి ఈటల ప్రశ్నించిన సంగతి తెలిసిందే.
Samayam Telugu ktr-kcr file photo


కాగా సీఎం పగ్గాలను కేటీఆర్ చేపట్టబోతున్నారని.. ఫిబ్రవరిలోనే ఈ మార్పు ఉండొచ్చని సీనియర్ కేబినెట్ మంత్రి ఒకరు తెలిపారని జాతీయ ఛానెల్ ఒకటి వెల్లడించింది. కేబినెట్లోనూ భారీగా మార్పులు ఉంటాయని ఆయన తెలిపారు. దీంతో ఫిబ్రవరిలో కేటీఆర్ సీఎం కావడం ఫిక్స్ అయినట్టేనని తెలుస్తోంది.

కరోనా లాక్‌డౌన్ దగ్గర్నుంచి కేసీఆర్ ప్రజల మధ్యకు రావడం లేదు. చాలా వరకు బాధ్యతలను కేటీఆర్‌ చూసుకుంటున్నారు. దీంతో 2023లో తెలంగాణ ఎన్నికలు జరగడానికి ముందే కేటీఆర్ సీఎం అవుతారనే ప్రచారం మొదలైంది. ఇటీవలి కాలంలో అది ఊపందుకుంది.

వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎలాగో గెలవలేదు కాబట్టి.. కొడుకును సీఎం చేయాలనే ముచ్చటను కేసీఆర్ తీర్చుకుంటున్నారని బీజేపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు. ప్రతిపక్షాల విమర్శలు ఎలాగున్నా.. కేటీఆర్‌కు సీఎం పగ్గాలు అప్పగించాక.. కేసీఆర్ కొంత కాలం విశ్రాంతి తీసుకొని.. ఆ తర్వాత జాతీయ రాజకీయాల వైపు అడుగులేసే అవకాశాలున్నాయి. అనూహ్య రీతిలో ఆయన బీజేపీతో దోస్తీ కట్టినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Also Read:

అలాంటి వారు మా టీకా తీసుకోవద్దు: సీరం ఇన్‌స్టిట్యూట్

7 ఏళ్ల పాపకు గుండెపోటు.. విషాదం, విమాన ప్రయాణం వల్లేనా?

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.