యాప్నగరం

ఎలక్ట్రిక్‌ వెహికిల్స్ హబ్‌గా తెలంగాణ.. కొత్త పాలసీ విడుదల

Telangana EV Policy: ఈ సదస్సులో మహీంద్ర అండ్‌ మహీంద్ర ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్‌ కాంత్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు.

Samayam Telugu 30 Oct 2020, 2:22 pm
తెలంగాణలో ఎలక్ట్రిక్‌ వాహనాల నూతన పాలసీని మంత్రి కేటీఆర్‌ విడుదల చేశారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్‌ వాహనాలను ప్రోత్సహించేలా ఈ విధానాన్ని రూపొందించారు. తయారీ, పెట్టుబడిదారులకు రాయితీలు కల్పించేలా నూతన విధానం రూపొందించినట్లు కేటీఆర్ తెలిపారు. ఈ నూతన విధానం అద్భుతంగా విజయవంతం కాబోతుందని కేటీఆర్ చెప్పారు. ఈ-వాహనాలకు హబ్‌గా తెలంగాణను మార్చబోతున్నట్లు తెలిపారు. రాష్ట్రాన్ని ఎలక్ట్రిక్‌ వాహనాల హబ్‌గా మార్చాలనే లక్ష్యంతో తీసుకొచ్చిన నూతన విధానాన్ని ఎలక్ట్రిక్‌ వాహనాల శిఖరాగ్ర సదస్సులో మంత్రులు పువ్వాడ అజయ్‌, ఇంద్రకరణ్‌ రెడ్డితో కలిసి కేటీఆర్‌ విడుదల చేశారు.
Samayam Telugu ఎలక్ట్రిక్ వెహికిల్స్ నూతన పాలసీ 2020 విడుదల
telangana ev policy


ఎలక్ట్రిక్‌ వాహనాల సంఖ్యను పెంచేందుకు సహకారం, భాగస్వామ్యం అనే అంశంపై సదస్సులో చర్చించారు. తెలంగాణలో ఎలక్ట్రిక్‌ వాహనాలు, ఇంధన నిల్వల కొత్త విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చిన ప్రభుత్వం వాహనాల ఉత్పత్తికి భారీ ప్రోత్సాహకాలను ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ.. కొత్త విధానం ద్వారా రాష్ట్రంలో పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ యూనిట్లు నెలకొల్పేందుకు అవకాశం ఉందని అన్నారు. ఈ-వాహనాల తయారీ రంగంలో కంపెనీలు పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టబోతున్నట్లు చెప్పారు.

వాహనాల పెరుగుదలకు అనుగుణంగా సరైన మౌలిక వసతులను కూడా కల్పిస్తామని వెల్లడించారు. ప్రతి 50 కిలోమీటర్లకు ఛార్జింగ్‌ స్టేషన్లు ఉండనున్నట్లు చెప్పారు. ఈ-వాహనాల తయారీతో పాటు బ్యాటరీ తయారీ కంపెనీలు సైతం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని కేటీఆర్ వివరించారు. ఇందుకు తగ్గరీతిలో పరిశ్రమల ఏర్పాటుకు భూములు కూడా అందుబాటులో ఉన్నాయని చెప్పారు.

ఎలక్ట్రిక్‌ విధానం ద్వారా ప్రభుత్వం ప్రకటించిన రాయితీలను భవిష్యత్‌లో మరింత పెంచేందుకు కృషి చేస్తామని కేటీఆర్‌ వివరించారు. రాష్ట్రంలో పెద్ద ఎత్తున సౌర విద్యుత్‌ అందుబాటులో ఉందని.. సరిగా వినియోగించుకున్నట్లయితే మంచి ఫలితాలను సాధించేందుకు అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని తెలిపారు. గత ఐదేళ్లలో తెలంగాణకు 2.8 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు వచ్చాయని కేటీఆర్ గుర్తు చేశారు. ఈ సదస్సులో మహీంద్ర అండ్‌ మహీంద్ర ఛైర్మన్‌ ఆనంద్‌ మహీంద్ర, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్‌ కాంత్‌ వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు.

Must Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.