యాప్నగరం

చీమలపాడు పేలుడు ఘటనలో కుట్రకోణం?.. మంత్రి కేటీఆర్ కీలక కామెంట్స్

Cheemalapadu Blast: చీమలపాడు పేలుడు ప్రమాద బాధితులను మంత్రి కేటీఆర్ పరామర్శించారు. నిమ్స్ ఆసుపత్రిలో వారిని పరామర్శించిన కేటీఆర్.. ఆరోగ్య పరిస్థితిపై వైద్యులను అడిగి ఆరా తీశారు. ఈ ఘటనపై విచారణ జరగుతోందని.., విచారణ తర్వాత పేలుడుకు గల కారణాలు వెలుగులోకి వస్తాయని మంత్రి వెల్లడించారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 13 Apr 2023, 11:40 am

ప్రధానాంశాలు:

  • చీమలపాడు బాధితులకు కేటీఆర్ పరామర్శ
  • ఆరోగ్య పరిస్థితిపై ఆరా
  • ఘటనపై దర్యాప్తు జరుగుతోందని వెల్లడి
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu Cheemalapadu blast
మంత్రి కేటీఆర్
Khammam Cylinder Explosion: ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం చీమలపాడులో బుధవారం ఘోర అగ్ని ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఓ గుడెసెలో సిలిండర్ పేలి ముగ్గురు మృతి చెందగా.. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. చీమలపాడులో బీఆర్ఎస్ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేయగా.. ఆ సమావేశానికి వచ్చిన పలువురు కార్యకర్తలు, పోలీసులు, జర్నలిస్టులు గాయపడ్డారు. పేలుడు దాటికి ఆ ప్రాంతంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి. కాళ్లు, చేతులు తెగిపడిపోయాయి. క్షతగాత్రుల హాహాకారాలతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాదం అలుముకుంది. క్షతగాత్రులను వెంటనే ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఈఘటనపై సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌తో పాటు పలువురు విచారం వ్యక్తం చేశారు. ఘటన జరగటం దురదుష్టకరమని అన్నారు. ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొనేందుకు వచ్చి ప్రాణాలు కోల్పోయిన కార్యకర్తలు, క్షతగాత్రులను అన్ని విధాలా ఆదుకుంటామని ప్రభుత్వం తెలిపింది. ప్రభుత్వం తరపున మృతలు కుటుంబాలకు రూ. 10 లక్షల పరిహారం, క్షతగాత్రులకు రూ. 2 లక్షలు ఉచిత వైద్యం అందిస్తామని చెప్పింది. బీఆర్ఎస్ పార్టీ తరపున మృతుల కుటుంబాలకు రూ.5 లక్షలు, క్షతగాత్రులకు రూ.2 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఎంపీ నామా, ఎమ్మెల్యే రాములు నాయక్ కూడా వ్యక్తిగతంగా పరిహారం ప్రకటించారు.

బీఆర్ఎస్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని.. ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఘటనకు బాధ్యులైన బీఆర్ఎస్ నేతలపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేశారు. ఆత్మీయ సమ్మేళనాల పేరుతో ఆ పార్టీ చేస్తున్న రాజకీయాలు ప్రజల పాలిట శాపంగా మారాయని టీపీసీసీ రేవంత్ మండిపడ్డారు. మృతుల కుటుంబాలకు రూ.కోటి, క్షతగాత్రులకు రూ.25 లక్షల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. మరోవైపు బీఆర్ఎస్ శ్రేణులు బాణాసంచా కాల్చటం వల్లే నిప్పు రవ్వలు గుడిసెపై పడి మంటలు చెలరేగాయని వార్తలు వచ్చాయి. ఆ వార్తలు ఎంపీ నామా నాగేశ్వరావు ఖండించారు. ఆత్మీయ సమ్మేళనం సభ ప్రాంగణానికి 200 మీటర్ల దూరంలో ఉందని, సమావేశం ప్రారంభమయ్యే సమయంలో ఓ గుడిసెలో సిలిండర్ పేలిందని ఆయన తెలిపారు.

ఇవాళ ఉదయం చీమల పాడు అగ్నిప్రమాద బాధితులను మంత్రి కేటీఆర్ పరామర్శించారు. నిమ్స్‌కు వెళ్లిన కేటీఆర్.. బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. నలుగురి ఆరోగ్య పరిస్థితి నిలకడగా వైద్యులు చెప్పారు. అనంతరం మీడియాతో మాట్లాడిన కేటీఆర్.. పేలుడు ఘటనపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందని అన్నారు. ఘటన తర్వాత విభిన్న కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పేలుడు ఘటనలో ఏదైనా కుట్ర కోణం ఉంటే విచారణలో తేలుతుందని చెప్పారు.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.