యాప్నగరం

రాష్ట్ర ప్రజలకు దసరా బహుమతి.. ఇవాళ డబుల్ బెడ్‌రూమ్ ఇళ్ల ప్రారంభం

ఇవాళ నగరంలో మూడుచోట్ల డబుల్ బెడ్ రూం ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. దసరా సందర్భంగా పేద ప్రజలకు బహుమతి అందించనట్లుంది.

Samayam Telugu 26 Oct 2020, 7:28 am
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా డబుల్ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం ప్రారంభించింది. అయితే పేదలకు తెలంగాణ ప్రభుత్వం దసరా బహుమతి అందించనుంది. సకల వసతులతో నిర్మించిన డబల్ బెడ్‌రూమ్ ఇండ్లను ఈరోజు ప్రారంభించనుంది. హైదరాబాద్‌లోని మూడు చోట్ల ఇవాళ ఉదయం మూడుచోట్ల డబుల్ బెడ్‌రూమ్ ఇండ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నారు. ఉదయం 10 గంటలకు జియాగూడలోని 840 ఇండ్లను, 11 గంటలకు గోడే కి కబర్‌లో 192 ఇళ్లను, 11.30 గంటలకు కట్టెల మండిలో 120 డబల్ బెడ్‌రూమ్ ఇండ్లను ప్రారంభిస్తారు.
Samayam Telugu డబుల్ బెడ్ రూం ఇళ్ల ప్రారంభం
double bedroom houses


Read More: తెలంగాణ ప్రజలకు శుభవార్త.. భారీగా తగ్గిన కరోనా కేసులు

మొత్తంగా మూడు చోట్లా కలిపి 1,152 ఇళ్లను లబ్దిదారులకు కేటాయించనున్నారు. ఇళ్ల ప్రారంభోత్సవంలో ఉపసభాపతి టీ పద్మారావు, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, మంత్రులు మహమూద్ అలీ, తలసాని శ్రీనివాస్ యాదవ్‌, ప్రశాంత్‌రెడ్డి, మేయర్ బొంతు రామ్మోహన్ పాల్గొననున్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం అర్హులైన పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుందని మంత్రి కేటీఆర్ అన్నారు. త్వరలోనే మిగతా ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి పేదలకు పంపకాలు చేపడతామని మంత్రి కేటీఆర్ చెప్పారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.