యాప్నగరం

కరోనా అంతానికి మంత్రి మల్లారెడ్డి కొత్త టిప్.. ఏకిపారేస్తున్న నెటిజన్లు

Coronavirus Telangana: విలేకరులు మంత్రి చెప్పిన మాటలు విని ముక్కున వేలేసుకోగా.. దానికి సంబంధించిన క్లిప్ నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వ్యాఖ్యలను నెటిజన్లు బాగా ట్రోల్ చేస్తున్నారు.

Samayam Telugu 20 Jun 2020, 11:36 pm
తెలంగాణ మంత్రి మల్లారెడ్డి కరోనా వైరస్ గురించి చేసిన ఓ కామెంట్ సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతోంది. హరితహారం కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ మంత్రి చివర్లో ఈ వ్యాఖ్య చేశారు. ప్రజలంతా స్వచ్ఛందంగా హరితహారం కార్యక్రమంలో పాల్గొనాలని, అలా చేసి కరోనా వైరస్‌ను తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు. అక్కడే ఉన్న విలేకరులు మంత్రి చెప్పిన మాటలు విని ముక్కున వేలేసుకోగా.. దానికి సంబంధించిన క్లిప్ నెట్టింట్లో విపరీతంగా వైరల్ అవుతోంది. ఆ వ్యాఖ్యలను నెటిజన్లు బాగా ట్రోల్ చేస్తున్నారు. మంత్రి కరోనాకు కొత్త మందు కనిపెట్టారంటూ చవాకులు పేల్చుతున్నారు.
Samayam Telugu మల్లారెడ్డి
Malla Reddy


Also Read: భర్తను భుజాలపై మోస్తూ ఊరి చుట్టూ భార్య ప్రదక్షిణలు.. సోదరుల వింత శిక్ష

అంతేకాక, కొద్ది రోజుల క్రితం మంత్రి మల్లారెడ్డి అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి సైతం మామను ముఖ్యమంత్రి అని పొరపాటున సంబోధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మల్లారెడ్డి వ్యాఖ్యలకు అల్లుడు రాజశేఖర్ రెడ్డి వ్యాఖ్యలను జతచేసి సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేస్తున్నారు. ‘‘కరోనా వ్యాధి పారిపోవాలంటే మనం హరితహారం చేయాల్సిందే.. జై తెలంగాణ.. జై కేసీఆర్’’ అని మంత్రి మల్లారెడ్డి వ్యాఖ్యానించారు.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.