యాప్నగరం

శ్యామల ఎవరో నాకు తెలీదు.. ఏ విచారణకైనా సిద్ధం: మంత్రి మల్లారెడ్డి

Dundigal: మంత్రి మల్లారెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడారు. తన భూమి పక్కనే ఆమె భూమి కూడా ఉందని మంత్రి అన్నారు. తాను భూమిని ఆక్రమించినట్లు వచ్చిన ఆరోపణలు నిజం కాదని అన్నారు.

Samayam Telugu 9 Dec 2020, 4:44 pm
భూ కబ్జా విషయంలో తనపై వచ్చిన ఆరోపణలు అబద్ధమని రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి ఖండించారు. తాను భూమిని ఆక్రమించినట్లు వచ్చిన ఆరోపణలు నిజం కాదని అన్నారు. ఫిర్యాదు చేసిన మహిళ శ్యామల ఎవరో తనకు తెలియదని అన్నారు. మంత్రి మల్లారెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడారు. తన భూమి పక్కనే ఆమె భూమి కూడా ఉందని మంత్రి అన్నారు. ‘‘ఇప్పటికే నాకు చాలా భూమి ఉంది. నేను ప్రజలకు సేవ చేస్తున్నా. ఒక మహిళకు మంత్రిగా సహాయం చేయడానికి సిద్ధం. శ్యామల అనే మహిళ ఇప్పటిదాకా నన్ను కలవలేదు. నేను ఎవరినీ బెదిరించలేదు. ఎలాంటి విచారణకైనా నేను సిద్ధమే’’ అని మంత్రి స్పందించారు.
Samayam Telugu మల్లారెడ్డి
mallareddy


మంగళవారం (డిసెంబరు 8) భూ వివాదంలో దుండిగల్ పోలీస్ స్టేషన్‌లో మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. తన భూమిని ఆక్రమించడమే కాకుండా రిజ్రిస్టేషన్‌ చేయాలంటూ బెదిరింపులకు దిగుతున్నారని దుండిగల్‌ పోలీస్ స్టేషన్‌లో శ్యామలా దేవి అనే మహిళ ఫిర్యాదు చేసింది. మంత్రితో పాటు ఆయన కుమారుడిపై కూడా కేసు నమోదు అయింది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.