ఆయన దొంగ అయితే.. ఈయన గజదొంగ.. సీఎం జగన్పై తెలంగాణ మంత్రి సంచలనం, వాళ్లు రాక్షసులంటూ..
Water Disputes: లంకలో పుట్టిన వాళ్లంతా రాక్షసులేనని, ఆంధ్రా వాళ్లు అందరూ తెలంగాణ వ్యతిరేకులేని మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ ప్రాజెక్టులపై యుద్ధానికి సిద్ధం కావాలని పాలమూరు ప్రజలకు పిలుపునిచ్చారు.
Samayam Telugu 22 Jun 2021, 10:21 pm
ప్రధానాంశాలు:
- ఏపీ-తెలంగాణ జల వివాదంపై..
- తెలంగాణ మంత్రి సంచలన వ్యాఖ్యలు
- తిప్పికొట్టిన ఏపీ నాయకులు
ఏపీ-తెలంగాణ మధ్య జల వివాదాలు ఇటీవలి కేబినెట్ సమావేశం సందర్భంగా మరోసారి చర్చకు వచ్చిన సంగతి తెలిసిందే. ఏపీలో రాయలసీమ ఎత్తిపోతల పథకం, ఆర్డీఎస్ విస్తరణ జరుగుతుండగా.. తెలంగాణలో క్రిష్ణా నదిపై తెలంగాణ కొత్త ప్రాజెక్ట్లకు రూపకల్పన చేస్తోంది. ఈ పరిస్థితులు రెండు రాష్ట్రాల మధ్య మరోసారి నీటి యుద్ధానికి దారితీస్తున్నాయి. ఇరు రాష్ట్రాల మంత్రుల స్థాయిలో మాటల యుద్ధం జరుగుతోంది. ఆర్డీఎస్ విస్తరణ పనులతో మొదలైన ఈ జగడం మరింత పెద్దదవుతోంది. ఈ క్రమంలోనే తెలంగాణ మంత్రి ప్రశాంత్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. లంకలో పుట్టిన వాళ్లంతా రాక్షసులేనని, ఆంధ్రా వాళ్లు అందరూ తెలంగాణ వ్యతిరేకులేని మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఏపీ ప్రాజెక్టులపై యుద్ధానికి సిద్ధం కావాలని పాలమూరు ప్రజలకు పిలుపునిచ్చారు. అక్రమ ప్రాజెక్ట్లను ఆపకపోతే పోరాటం తప్పదని ప్రశాంత్ రెడ్డి ఏపీ సీఎం జగన్ను హెచ్చరించారు. కొత్త ప్రాజెక్టులు కట్టడం లేదని గ్రీన్ ట్రిబ్యునల్కు చెప్పి దొంగతనంగా కడుతున్నారని విమర్శించారు. సీఎం కేసీఆర్ అన్ని వివరాలు తెప్పించారని, త్వరలోనే ప్రధానికి కూడా ఫిర్యాదు చేస్తారని చెప్పారు. అయినా ప్రాజెక్టులు ఆపకపోతే యుద్ధం తప్పదని హెచ్చరించారు. ఈ సందర్భంలోనే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డిపైనా విమర్శలు చేశారు. రాజశేఖర్ రెడ్డి ఆనాడు పొతిరెడ్డి పాడు ద్వారా నీటిని దొంగతనంగా తరలించుకుపోయి నీటి దోంగగా మారారని.. ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సైతం అనుమతి లేని ప్రాజెక్టులను నిర్మిస్తూ గజదొంగగా మారారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ నేతల మండిపాటు
మరోవైపు, మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఏపీ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఆంధ్ర ప్రజలను మంత్రి లంక వాసులతో పోల్చడంపై నిరసన వ్యక్తం చేశారు. ఎప్పుడో జరగాల్సిన ఆర్డీఎస్ కుడి కాలువ పనులు ఇప్పుడు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కృష్ణ, గోదావరి ట్రిబ్యునల్ నుండి ఇష్టం వచ్చినట్టి జలచౌర్యం చేస్తుందని కర్నూలు టీడీపీ నేతలు ఆరోపించారు. తమకు రావాల్సిన 4 టీఎంసీల నీటి వాటా ప్రకారం టెండర్ వేసి కుడి కాలువ పనులు జరుగుతున్నాయని చెప్పారు.
టీడీపీ నేతల మండిపాటు
మరోవైపు, మంత్రి ప్రశాంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఏపీ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. ఆంధ్ర ప్రజలను మంత్రి లంక వాసులతో పోల్చడంపై నిరసన వ్యక్తం చేశారు. ఎప్పుడో జరగాల్సిన ఆర్డీఎస్ కుడి కాలువ పనులు ఇప్పుడు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం కృష్ణ, గోదావరి ట్రిబ్యునల్ నుండి ఇష్టం వచ్చినట్టి జలచౌర్యం చేస్తుందని కర్నూలు టీడీపీ నేతలు ఆరోపించారు. తమకు రావాల్సిన 4 టీఎంసీల నీటి వాటా ప్రకారం టెండర్ వేసి కుడి కాలువ పనులు జరుగుతున్నాయని చెప్పారు.