యాప్నగరం

కేసీఆర్‌ను కలిసేందుకు వెళ్తుండగా.. మంత్రి పువ్వాడ కాన్వాయ్‌కు ప్రమాదం

ప్రగతి భవన్ వెళ్తుండగా మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ కాన్వాయ్ ప్రమాదానికి గురైంది. ఆయన కాన్వాయ్‌లోని వాహనాలు ఒక దానితో మరొకటి ఢీకొట్టాయి.

Samayam Telugu 17 Feb 2020, 2:10 pm
రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ కాన్వాయ్‌ ప్రమాదానికి గురైంది. సీఎం కేసీఆర్‌ను కలిసి బర్త్ డే విషెస్ చెప్పడానికి బయల్దేరగా.. బంజారాహిల్స్ జీవీకే మాల్‌ వద్ద బైక్‌ను తప్పించబోయి కాన్వాయ్‌లోని వాహనాలు ఒక్కదాన్ని మరొకటి ఢీకొట్టాయి. ఈ ఘటనలో నాలుగు వాహనాలు దెబ్బతిన్నాయి. కాన్వాయ్‌లోని వాహనాలు తక్కువ వేగంతోనే వెళ్తుండటంతో.. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. అనంతరం మంత్రి వేరే వాహనంలో ప్రగతి భవన్ వెళ్లారు.
Samayam Telugu kcr puvvada ajay1


పాతికేళ్ల క్రితం పువ్వాడ అజయ్ తీవ్ర రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. అజయ్, ఆయన స్నేహితుడు ప్రయాణిస్తున్న వాహనం డివైడర్‌ను ఢీకొట్టింది. చాలా రోజులపాటు ఆయన అపస్మారక స్థితిలో ఉండిపోయారు. కళ్లపైనా ఎఫెక్ట్ పడింది. చాలా సర్జరీల తర్వాత ఆయన కోలుకున్నారు.

గత ఎన్నికల్లో ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి టీఆర్ఎస్ తరఫున గెలుపొందిన ఏకైక ఎమ్మెల్యే పువ్వాడ అజయ్ కుమార్. ఆయన కేటీఆర్‌కు సన్నిహితుడు. కేబినెట్ విస్తరణలో భాగంగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన ఆయనకు కేసీఆర్ మంత్రి పదవి ఇచ్చారు. 2014లో ఆయన కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సీపీఐ జాతీయ నాయకుడు పువ్వాడ నాగేశ్వరరావు ఆయన తండ్రి. వైఎస్సార్సీపీతో రాజకీయాల్లోకి అడుగుపెట్టిన అజయ్.. పార్టీ జిల్లా అధ్యక్షుడిగా పని చేశారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.