యాప్నగరం

Khammam: 'ఆ పని చేసి చూడు కరెంట్ ఉందో లేదో తెలుస్తుంది'.. బండికి పువ్వాడ కౌంటర్

Khammam: ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ విజయవంతం కావటాన్ని జీర్ణించుకోలేని బీజీపీ అధ్యక్షుడు బండి సంజయ్ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని మంత్రి పువ్వాడ మండిపడ్డారు. రాష్ట్రంలో 24 గంటల కరెంట్ ఉందో లేదో తెలుసుకునేందుకు ఏదైనా మోటర్‌లో వేలు పెట్టి చూడాలని తనదైన శైలిలో చురకలంటించారు.

Authored byసందీప్ పూల | Samayam Telugu 19 Jan 2023, 4:00 pm

ప్రధానాంశాలు:

  • సంజయ్ వ్యాఖ్యలకు మంత్రి పువ్వాడ కౌంటర్
  • కరెంట్ కోసం మోటర్‌లో వేలుపెట్టి చూడాలని చురకలు
  • సభ సకెక్స్ కావటాన్ని సంజయ్ జీర్ణించుకోలేకపోతున్నారని ఆక్షేపణ
హైలైట్స్ చదవాలంటే యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి
Samayam Telugu puvvada Ajay Kumar
పువ్వాడ అజయ్ కుమార్
Khammam: ఖమ్మం బీఆర్ఎస్ సభపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (Bandi Sanjay Kumar) చేసిన కామెంట్స్‌కు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ (Puvvada Ajay Kumar) కౌంటర్ ఇచ్చారు. కంటి వెలుగులో బండి సంజయ్ అద్దాలు తీసుకుంటే మంచిదని ఎద్దేవా చేశారు. ఖమ్మం సభ విజయవంతం కావాటాన్ని సంజయ్ జీర్ణించుకోలేకపోతున్నారని.. అందుకనే తొండి మాటలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో 24 గంటలు కరెంట్ ఉందో లేదో తెలియాలంటే ఏ మోటర్‌లోనైనా సంజయ్ వేలు పెట్టి చూడాలని తనదైన శైలిలో చురకలింటారు.
ఖమ్మంలో నిర్వహించిన బీఆర్ఎస్ సభ చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకే తెలంగాణ సీఎం కేసీఆర్ నడుంబిగించారన్నారు. సమైఖ్య సూర్తిని దెబ్బతీస్తున్న ప్రధాని మోదీ పాలనకు ఎండ్ కార్డు పడక తప్పదన్నారు. తెలంగాణ సంక్షేమ పథకాలు దేశానికి ఆదర్శం కానున్నాయని చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను నిన్నటి సభలో పాల్గొన్న సీఎంలు ప్రశంసించారని చెప్పారు.

బండి సంజయ్ ఏమన్నారంటే..
తెలంగాణలో 24 గంటల ఉచిత కరెంట్ అందిస్తున్నామని ఖమ్మం బీఆర్ఎస్ సభలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బండి సంజయ్ ఫైర్ అయ్యారు. తెలంగాణలో కరెంట్‌ ఎప్పుడూ వస్తుందో.. ఎప్పుడో పోతుందో ఎవరికీ తెలియదన్నారు. రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ ఏ గ్రామానికైనా ఇస్తే.. తాను రాజీనామా చేయటానికి సిద్ధమని సవాల్ విసిరారు. డిస్కమ్‌లకు ఇంకా బకాయిలు చెల్లించటం లేదని... ప్రభుత్వ పనులు చేసిన వారికి బిల్లులు ఇవ్వడం లేదని మడిపడ్డారు.

గోదావరిలో ఉన్న నీటి లభ్యతను కూడా కేసీఆర్ వాడుకోవటం లేదని బండి సంజయ్ ఆక్షేపించారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన వాటా కూడా వదులుకున్న వ్యక్తి కేసీఆర్‌ అని మండిపడ్డారు. జలాలను సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రంలో బోర్ల సంఖ్య 18 లక్షల నుంచి 24 లక్షలకు ఎందుకు పెరిగిందని సీఎం కేసీఆర్‌ను సంజయ్ నిలదీశారు.

  • Read More Telangana News And Telugu News
రచయిత గురించి
సందీప్ పూల
సందీప్ పూల సమయం తెలుగులో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన తాజా వార్తలు, రాజకీయ వార్తలు, ప్రత్యేక కథనాలు అందిస్తుంటారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పొలిటికల్ న్యూస్, ఇతర రంగాలకు సంబంధించి వార్తలు రాశారు.... మరిన్ని చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.