యాప్నగరం

తీన్మార్ మల్లన్నపై రూ.10 కోట్లకు మంత్రి పరువు నష్టం దావా

Teenmar Mallanna | defamation Case : జర్నలిస్ట్, యాక్టివిస్ట్ తీన్మార్ మల్లన్నపై రూ.10 కోట్లకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరువు న‌ష్టం దావా వేశారు. ఈ మేర‌కు మంత్రి త‌న లాయర్ చేత మల్లన్నకు నోటీసులు పంపించారు.

Authored byRaj Kumar | Samayam Telugu 17 May 2022, 1:51 pm
జర్నలిస్ట్, యాక్టివిస్ట్ చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్నకు షాక్ తగిలింది. మల్లన్నపై రూ.10 కోట్లకు రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పరువు న‌ష్టం దావా వేశారు. ఈ మేర‌కు మంత్రి త‌న న్యాయ‌వాది చేత మల్లన్నకు నోటీసులు పంపించారు. మంత్రి పువ్వాడ అజయ్ వ్యక్తిగత ప్రతిష్టను దృష్టిలో ఉంచుకొని ఆయ‌న‌పై నిరాధార‌ ఆరోప‌ణ‌లు చేసి ప్రచారం పొందాల‌నే దురుద్దేశంతోనే తీన్మార్ మల్లన్న తన యూట్యూబ్ చానల్, పత్రికలో అబ‌ద్ధాలు చెప్పారని నోటీసుల్లో న్యాయ‌వాది పేర్కొన్నారు.
Samayam Telugu తీన్మార్ మల్లన్న


సరూర్‌నగర్: ఫైండ్ మై డివైస్ ఆధారంగా హత్య.. అదే టెక్నాలజీతో చెక్ పెట్టిన పోలీసులు
మల్లన్న దుర్బుద్ధితో జర్నలిస్ట్‌గా చెలామణి అవుతూ జర్నలిజంలో కనీస ప్రమాణాలు పాటించకుండా అసత్యాలు ప్రచారం చేశారని న్యాయ‌వాది పేర్కొన్నారు. తన క్లయింట్ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ప‌రువుకు భంగం క‌లిగించేలా అసత్య పూరిత ప్రచారం చేసిన తీన్మార్ మల్లన్న.. సివిల్, క్రిమిన‌ల్ చ‌ట్టాల ప్రకారం మంత్రికి రూ.10 కోట్లు ప‌రిహారం చెల్లించాల‌ని పేర్కొన్నారు. వీటితో పాటు చ‌ట్ట ప్రకారం త‌గిన చ‌ర్యలకు అర్హుల‌వుతార‌ని నోటీసుల్లో న్యాయ‌వాది తెలిపారు. 7 రోజుల్లో తన క్లైంట్ మంత్రి పువ్వాడ అజయ్‌కు బేషరతుగా క్షమాపణ చెప్పాల‌ని నోటీసుల్లో డిమాండ్ చేశారు. కాగా, కొంతకాలం క్రితం బీజేపీలో చేరిన తీన్మార్ మల్లన్న.. ఇటీవల ఆ పార్టీ నుంచి బయటికొస్తున్నట్లు పరోక్ష వ్యాఖ్యలు చేశారు. త్వరలోనే కొత్త పాార్టీ పెట్టబోతున్నట్లు.. ఇకపై బీజేపీ ఆఫీస్ తొక్కబోనంటూ ప్రకటించారు. ఆ తర్వాత నుంచి ఆయన బీజేపీ నేతలతో అంటీముట్టన్నట్లుగానే ఉంటారు.
రచయిత గురించి
Raj Kumar

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.