యాప్నగరం

Penna Cements Case: సీబీఐ కోర్టులో మంత్రి సబిత హాజరు, విచారణ వాయిదా

Disproportionate assets case: మంత్రి సబితతోపాటు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పెన్నా ప్రతాప్ రెడ్డి, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, వీడి రాజగోపాల్, రిటైర్డ్ ఐఏఎస్ శామ్యూల్ తదితరులు నాంపల్లిలోని సీబీఐ కోర్టులో హాజరయ్యారు.

Samayam Telugu 17 Jan 2020, 12:48 pm
తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ అక్రమాస్తుల కేసులో విచారణ కోసం మంత్రి హాజరుకావాలని ఈ నెల 10న న్యాయమూర్తి సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మంత్రి సబితతోపాటు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, పెన్నా ప్రతాప్ రెడ్డి, ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, వీడి రాజగోపాల్, రిటైర్డ్ ఐఏఎస్ శామ్యూల్ తదితరులు నాంపల్లిలోని సీబీఐ కోర్టులో హాజరయ్యారు. అనంతపురం, కర్నూలు, రంగారెడ్డి జిల్లా తాండూరులోని భూ గనుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని సీబీఐ ఆరోపిస్తున్న సంగతి తెలిసిందే.
Samayam Telugu sabitha indra reddy


Also Read: ‘వాళ్లను గెలిపిస్తే ఫాం హౌస్‌లకు పాలేర్లుగా మారిపోతారు’

పెన్నా సిమెంట్స్ కేసులో సీబీఐ రెండేళ్ల క్రితం దాఖలు చేసిన అనుబంధ ఛార్జిషీటును ప్రత్యేక కోర్టు వారం క్రితం విచారణకు స్వీకరించింది. ఈ నేపథ్యంలో విచారణకు హాజరు కావాలని ఆరోపణలు ఎదుర్కొంటున్న మంత్రి సబితా ఇంద్రా రెడ్డి, మాజీ మంత్రి ధర్మానకు సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. వీరితోపాటు ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మి, విశ్రాంత అధికారులు శామ్యూల్, వీడీ రాజగోపాల్‌, డీఆర్‌వో సుదర్శన్ రెడ్డి, తహసీల్దార్ ఎల్లమ్మకు సమన్లు జారీ అయ్యాయి. పెన్నా సిమెంట్స్ కేసులో ఈ నెల 17న హాజరుకావాలని కోర్టు వీరికి ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో అనుబంధ ఛార్జిషీటును పరిగణించవద్దని జగన్ గతంలోనే కోరగా.. వీరి వాదనలను సీబీఐ కోర్టు తోసిపుచ్చింది.

Also Read: Muncipal Elections: ‘ఇల్లు అలా ఉంటే మున్సిపల్‌ పన్ను రద్దు’

విచారణ వాయిదా
పెన్నా కేసు అనుబంధ ఛార్జిషీటుకు సంబంధించిన విచారణను శుక్రవారం చేపట్టిన సీబీఐ కోర్టు.. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేసింది. అయితే, శుక్రవారం నాటి విచారణకు మాత్రం జగన్‌కు వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపునిచ్చారు.

Also Read: Hyderabad: మరింత పెరగనున్న చలి.. ఆ ప్రాంతాల్లో ఇంకా!

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.