యాప్నగరం

‘హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్ ఉందా‌?’ మంత్రి సబిత కీలక వ్యాఖ్యలు

Hyderabad Coronavirus: హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌కు సంబంధించి వైద్యఆరోగ్యశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారని.. త్వరలోనే కేబినెట్ సమావేశం పెట్టి నిర్ణయం తీసుకుంటామని సబిత చెప్పారు.

Samayam Telugu 30 Jun 2020, 11:51 pm
కరోనా కట్టడికి లాక్‌ డౌన్ అమలు పరిష్కారం కాదని విద్యాశాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి అభిప్రాయపడ్డారు. మళ్లీ సంపూర్ణంగా లాక్‌డౌన్ విధిస్తే చిన్న కుటుంబాలు ఆర్థికంగా మరింతగా ఇబ్బందుల పాలవుతాయని అన్నారు. కరోనా నిబంధనలు పటిష్ఠంగా పాటిస్తూ, తగిన జాగ్రత్తలు తీసుకుంటూనే కరోనాను పారద్రోలాలని పిలుపునిచ్చారు. మంగళవారం రాజేంద్రనగర్‌లో మరో మంత్రి సత్యవతి రాథోడ్‌తో కలిసి సబిత హరితహారంలో పాల్గొన్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు.
Samayam Telugu సబితా ఇంద్రారెడ్డి
sabitha indra reddy


హైదరాబాద్‌లో లాక్‌డౌన్‌కు సంబంధించి వైద్యఆరోగ్యశాఖ అధికారులు ప్రతిపాదనలు పంపారని.. త్వరలోనే కేబినెట్ సమావేశం పెట్టి నిర్ణయం తీసుకుంటామని సబిత చెప్పారు.

తెలంగాణలో కరోనా కేసులు విపరీతంగా నమోదవుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలోనే మరీ ఎక్కువగా కేసులు వస్తున్నాయి. రాష్ట్రంలో నమోదయ్యే మొత్తం కేసుల్లో సింహభాగం హైదరాబాద్ పరిధిలోనే ఉంటున్నాయి. దీంతో కరోనాను కట్టడి చేసేందుకు హైదరాబాద్‌లో లాక్‌డౌన్ విధించాలనే ప్రతిపాదన తెరపైకి వచ్చింది. సీఎం కేసీఆర్ కూడా లాక్ డౌన్‌కు మొగ్గు చూపారు.

జూలై 2న తెలంగాణ మంత్రి వర్గ సమావేశం జరిగే అవకాశం ఉన్న సంగతి తెలిసిందే. ఈ భేటీలో హైదరాబాద్‌లో మళ్లీ లాక్‌డౌన్ విధించే అంశంపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. మరోవైపు తెలంగాణలో ఒకేరోజు 945 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. తాజా కేసులతో తెలంగాణలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 16,339 కు చేరింది.

Also Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.