యాప్నగరం

స్కూళ్లు, కాలేజీల రీ ఓపెన్: వారికి మంత్రి సబిత కీలక ఆదేశాలు

Hyderabad: విద్యా సంస్థల్లో భోజన సదుపాయాల ఏర్పాటుకుగానూ బియ్యం, పప్పు, ఇతర ఆహార ధాన్యాలను జిల్లా కలెక్టర్లు సమకూర్చుతారని మంత్రి తెలిపారు.

Samayam Telugu 12 Jan 2021, 9:18 pm
కొవిడ్‌ వ్యాప్తితో మూసివేసిన విద్యాసంస్థలను తిరిగి తెరిచేందుకు ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు ఈనెల 25 నాటికి సిద్ధంగా ఉండాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఫిబ్రవరి 1న విద్యా సంస్థలు ప్రారంభించాలని సీఎం కేసీఆర్‌ నిర్ణయించిన వేళ విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి చిత్రా రాంచంద్రన్, సాంకేతిక, కళాశాల విద్యాశాఖల కమిషనర్ ననీన్ మిట్టల్, ఉన్నతాధికారులతో మంత్రి సబితా ఇంద్రారెడ్డి సమావేశం నిర్వహించారు. స్కూళ్లు, కాలేజీల నిర్వహణకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందించాలని అధికారులను ఆమె ఆదేశించారు. తొమ్మిది, పది, ఇంటర్, డిగ్రీ, ఇతర వృత్తి విద్యా కోర్సుల నిర్వహణకు తరగతుల వారీగా ప్రత్యేక కార్యాచరణ ప్రణాళికను రూపొందించి ఈ నెల 20లోగా నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించారు.
Samayam Telugu సబితా ఇంద్రారెడ్డి (ఫైల్ ఫోటో)
sabitha indra reddy


విద్యా సంస్థల్లో భోజన సదుపాయాల ఏర్పాటుకుగానూ బియ్యం, పప్పు, ఇతర ఆహార ధాన్యాలను జిల్లా కలెక్టర్లు సమకూర్చుతారని మంత్రి తెలిపారు. జిల్లా, మండల విద్యాధికారులు అన్ని పాఠశాలలను ప్రత్యక్షంగా పరిశీలించి అవసరమైన చర్యలను చేపట్టాలని అన్నారు. వివిధ సంక్షేమ శాఖలు నిర్వహిస్తున్న గురుకుల పాఠశాలలు, కళాశాలలను పూర్తి స్థాయిలో సన్నద్ధం చేసేందుకు ఈ నెల 18న ఆయా స్థానిక మంత్రులు, అధికారులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.

ప్రభుత్వ మార్గదర్శకాలను ప్రైవేట్ విద్యా సంస్థలు కచ్చితంగా పాటించాలని.. ఈనెల 19న ప్రైవేట్ విద్యా సంస్థల యాజమాన్యాలతో సమావేశం నిర్వహించనున్నట్లు మంత్రి చెప్పారు. ప్రైవేట్ సంస్థల్లో తీసుకోవాల్సిన చర్యలపై మంత్రి చర్చించనున్నారు. కరోనా నేపథ్యంలో గత ఏడాది మార్చి నెలలో విద్యా సంస్థలు మూసివేసిన సంగతి తెలిసిందే. కరోనా కేసులు తగ్గుతుండడం వ్యాక్సిన్ కూడా అందుబాటులోకి రావడంతో విద్యా సంస్థలను తెరవాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ఇవి కూడా చదవండి

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.