యాప్నగరం

తెలంగాణ జవానుకు అంత్యక్రియలు.. పాడె మోసిన మంత్రి

Mahabubnagar: మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం గువ్వని కుంట తండాలో ఆర్మీ జవాను అంత్యక్రియలు ముగిశాయి. ఈ అంత్యక్రియలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు.

Samayam Telugu 27 Dec 2020, 4:28 pm
జమ్ము కశ్మీర్‌లోని లఢఖ్‌‌లో కొండ చరియలు విరిగిపడి మరణించిన మహబూబ్ నగర్ జిల్లా గుండీడ్ మండలం గువ్వనికుంట తండాకు చెందిన జవాను మరణించిన సంగతి తెలిసిందే. ఈయన ఆర్మీలో హవాల్దార్‌గా పనిచేస్తున్నారు. డ్యూటీలో ఉండగా ప్రమాదవశాత్తు దేశ సేవలో అకాల మరణం చెందారు. దీంతో ఆయన పార్థివదేహాన్ని స్వగ్రామానికి పంపారు. ఈ సందర్భంగా పర్యటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్, ఎంపీ రంజిత్ రెడ్డి, పరిగి ఎమ్మెల్యే మహేష్ రెడ్డి శంషాబాద్ విమానాశ్రయంలో ఘనంగా నివాళులర్పించారు.
Samayam Telugu పాడె మోస్తున్న శ్రీనివాస్ గౌడ్
minister srinivas goud


ఆదివారం మహబూబ్ నగర్ జిల్లా గండీడ్ మండలం గువ్వని కుంట తండాలో ఆర్మీ జవాను అంత్యక్రియలు ముగిశాయి. ఈ అంత్యక్రియలకు మంత్రి శ్రీనివాస్ గౌడ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా పరశురాం పాడెను మంత్రి శ్రీనివాస్ గౌడ్ మోశారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసులు గౌరవ వందనంగా గాలిలోకి కాల్పులు జరిపారు.

దేశ సేవలో అశువులు బాసిన పరశురాం సేవలను మంత్రి శ్రీనివాస్ గౌడ్ కీర్తించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.25 లక్షల ఆర్థిక సాయం, మహబూబ్ నగర్ పట్టణంలో డబుల్ బెడ్ రూమ్ ఇంటిని పరశురాం కుటుంబానికి అందిస్తున్నట్లు మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రకటించారు.

పరశురాం కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. సైనిక సంక్షేమ నిధి నుండి నిధులు విడుదల అయ్యేలా కృషి చేస్తానని అన్నారు. కేంద్ర ప్రభుత్వం పరశురాం కుటుంబానికి నష్ట పరిహారం అందించాలని కోరారు. గతంలో చైనా దురాక్రమణలో అసువులు బాసిన కల్నల్ సంతోష్ బాబు కుటుంబాన్ని అదుకున్నామని ఈ సందర్భంగా మంత్రి గుర్తు చేసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.