యాప్నగరం

హైదరాబాద్: మంత్రివర్యుల వాస్తు నమ్మకం.. నిలిచిపోయిన ప్రారంభోత్సవం

Adikmet: మధ్యాహ్నం కార్యాలయానికి వచ్చిన మంత్రి శ్రీనివా‌స్ గౌడ్‌ కార్యాలయాన్ని పరిశీలించారు. ఆఫీసు మెయిన్‌ రోడ్‌పై ఉన్నప్పటికీ వాస్తు లేదని, ఇది వారికి అచ్చిరాదని తేల్చి చెప్పారు.

Samayam Telugu 22 Nov 2020, 11:13 am
వాస్తు సరిగ్గా లేదని హైదరాబాద్‌లోని అడిక్‌మెట్‌ డివిజన్‌ ఎన్నికల కార్యాలయ ప్రారంభోత్సం ఆగిపోయింది. డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి బి.హేమలత జయరాంరెడ్డి రాంనగర్‌ బ్రిడ్జి సమీపంలోని నూతన భవనంలో కార్యాలయం ఏర్పాటు చేశారు. శనివారం సాయంత్రం 4 గంటలకు ఈ కార్యాలయ ప్రారంభోత్సవం ఉంది. మధ్యాహ్నం కార్యాలయానికి వచ్చిన మంత్రి శ్రీనివా‌స్ గౌడ్‌ కార్యాలయాన్ని పరిశీలించారు. ఆఫీసు మెయిన్‌ రోడ్‌పై ఉన్నప్పటికీ వాస్తు లేదని, ఇది వారికి అచ్చిరాదని తేల్చి చెప్పారు.
Samayam Telugu శ్రీనివాస్ గౌడ్ (ఫైల్ ఫోటో)
Srinivas goud


దీంతో హేమలత రెడ్డి విద్యానగర్‌లో గతంలో చూసిన ఓ భవనాన్ని మంత్రికి చూపించారు. దాన్ని ఆయన ఓకే చేశారు. ముందుగా చూసిన కార్యాలయ భవనాన్ని పార్టీ సమావేశాల కోసం వాడుకోవాల్సిందిగా మంత్రి సూచించారు. మంత్రికి ఉన్న వాస్తు నమ్మకాన్ని చూసి అక్కడున్న పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆశ్చర్యపోయారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ కూడా మంత్రి చెప్పిన విధంగానే తన కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.