యాప్నగరం

అలాంటి కుక్కల్లాగా మేం అరవం.. మంత్రి తలసాని సంచలన వ్యాఖ్యలు

Telangana Bhavan: జ్యోతి రావు ఫూలే విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోతున్నట్లు మరోసారి చెప్పారు. ప్రతి వాళ్లు జ్యోతి రావు పూలే పేరు చెప్పుకున్నారు కానీ.. ఆయన ఆశయాలను నిజంగా అమలు చేస్తున్నది టీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు.

Samayam Telugu 9 Mar 2020, 1:40 pm
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈసారి కాస్త డోసు పెంచి విపక్షాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ప్రతిపక్ష నేతల లాగా కుక్కల్లా అరవబోమని.. తమకు బాధ్యత ఉందని అన్నారు. సోమవారం తలసాని విలేకరులతో మాట్లాడారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల వ్యవహారంలో ప్రతిపక్షాలు రాద్దాంతం చేస్తున్న నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు. డబుల్‌ బెడ్‌రూమ్ ఇళ్లు ఇవాళ మొదలు పెట్టగానే రేపు పూర్తి కాబోవని వ్యాఖ్యానించారు. కేవలం మాట్లాడాలి కాబట్టి ఏదో ఒకటి అనే రీతిలో కాంగ్రెస్, బీజేపీలు అర్థరహిత విమర్శలు చేస్తున్నాయని తలసాని మండిపడ్డారు. డబుల్ బెడ్ రూం ఇళ్లకు తొందర లేదని త్వరలోనే కడతామని తెలిపారు.
Samayam Telugu Talasani


ఆర్థిక మాద్యంలోనూ అద్భుతమైన బడ్జెట్ ప్రవేశపెట్టామని తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ 6 నెలలు కృషి చేస్తే ఇంత అద్భుతమైన బడ్జెట్ రూపొందిందని చెప్పారు. ఈ బడ్జెట్‌ను ఆర్థిక రంగ నిపుణులు సైతం స్వాగతించారని గుర్తు చేశారు. సబ్బండ వర్గాలకు ఈ బడ్జెట్‌ ద్వారా మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీసీల ఉన్నతికి తోడ్పడే అంశాలు బడ్జెట్ లో చాలా ఉన్నాయని, దాదాపు 7 దశాబ్దాల తర్వాత వారికి న్యాయం జరుగుతుందని చెప్పారు.

జ్యోతి రావు ఫూలే విగ్రహాన్ని హైదరాబాద్‌లో ఏర్పాటు చేయబోతున్నట్లు మరోసారి చెప్పారు. ప్రతి వాళ్లు జ్యోతి రావు పూలే పేరు చెప్పుకున్నారు కానీ.. ఆయన ఆశయాలను నిజంగా అమలు చేస్తున్నది టీఆర్ఎస్ మాత్రమేనని అన్నారు. దేవాలయాల అభివృద్ధి కోసం రూ.500 కోట్లను బడ్జెట్‌లో కేటాయించిన ఘనత కేసిఆర్‌దేనని కొనియాడారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.