యాప్నగరం

సీఎం జగన్‌కు తెలంగాణ మంత్రి తలసాని ధన్యవాదాలు

YS Jagan: ఎంతో కాలంగా పరిష్కారం కాకుండా ఉన్న ఈ సమస్యను ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఓ కొలిక్కి తెచ్చినందుకు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు.

Samayam Telugu 17 Jun 2020, 12:07 am
ఆంధ్రప్రదేశ్‌లో జగన్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆనందం వ్యక్తం చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో సన్నిధి గొల్లకు వంశపారంపర్యం హక్కు‌ను కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆమోదం తెలపడం ఆనందదాయక అంశమని తెలంగాణ రాష్ట్ర మత్స్య, పశుసంవర్ధక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హర్షం వ్యక్తం చేశారు. ఎంతో కాలంగా పరిష్కారం కాకుండా ఉన్న ఈ సమస్యను ఓ కొలిక్కి తెచ్చినందుకు ఏపీ సీఎం జగన్‌కు తలసాని ధన్యవాదాలు తెలిపారు. వంశ పారంపర్య హక్కు కల్పిస్తూ తీసుకున్న ఈ నిర్ణయంతో జగన్ యాదవుల మనస్సులో చిరస్థాయిగా నిలిచిపోతారని మంత్రి తలసాని కొనియాడారు.
Samayam Telugu తలసాని, జగన్
Talasani


Also Read: గోకుల్ చాట్ ఓనర్‌కు కరోనా.. ఆ రూమర్లపై ఫ్యామిలీ క్లారిటీAlso Read: undefined

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.