యాప్నగరం

కేబుల్ బ్రిడ్జిని సందర్శించిన మంత్రి తలసాని.. ప్రారంభం ఎప్పుడంటే..

Hyderabad: వంతెన నిర్మాణంలో వాడిన సాంకేతిక పద్ధతులు, ఇంజినీరింగ్ నైపుణ్యం, డిజైన్ వంటి వివరాలను మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రపంచంలోని పెద్ద కేబుల్ వంతెనలలో ఇది కూడా ఒకటి కావడం విశేషం.

Samayam Telugu 16 Aug 2020, 4:19 pm
విశ్వనగరంగా రూపుదిద్దుకుంటున్న హైదరాబాద్ నగరానికి కేబుల్ బ్రిడ్జి ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్న సంగతి తెలిసిందే. మాదాపూర్ వద్ద దుర్గం చెరువుపై రూ.184 కోట్ల వ్యయంతో దీన్ని నిర్మించారు. ఈ కేబుల్ వంతెనను పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమ, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆదివారం పరిశీలించారు. వంతెన నిర్మాణంలో వాడిన సాంకేతిక పద్ధతులు, ఇంజినీరింగ్ నైపుణ్యం, డిజైన్ వంటి వివరాలను మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రపంచంలోని పెద్ద కేబుల్ వంతెనలలో ఇది కూడా ఒకటి కావడం విశేషం. ఈ బ్రిడ్జి రాకతో దుర్గం చెరువు ప్రాంతం పర్యటకంగా మరింత అభివృద్ధి చెందనుంది.
Samayam Telugu విద్యుద్దీప కాంతులతో తళుకులీనుతున్న దుర్గం చెరువు తీగల వంతెన
talasani srinivas visits cable bridge


త్వరలోనే ఈ వంతెనను ప్రారంభించనున్నారు. ఇటీవల మంత్రి కేటీఆర్ ట్విటర్ ద్వారా ‘ఆస్క్ కేటీఆర్’ కార్యక్రమం నిర్వహించిన సందర్భంగా ఈ వంతెన ప్రారంభంపై కీలక ప్రకటన చేశారు. కొద్ది రోజుల క్రితమే నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ వంతెనపై రాకపోకలను ఎప్పుడు ప్రారంభిస్తారని ఓ నెటిజన్ ప్రశ్నించారు. దీనికి మంత్రి సమాధానమిస్తూ ఆగస్టు నెలాఖరు నాటికి ప్రారంభం ఉంటుందని తెలిపారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.