యాప్నగరం

తలసాని పుట్టినరోజు.. మొక్కలు నాటిన మంత్రి

ఇవాళ మంత్రి తలసాని పుట్టినరోజు. ఈ సందర్భంగా మొక్కలు నాటారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగంగా తన నివాసంలో మొక్కలు నాటి ఎంపీ జోగినపల్లి సంతోష్‌కు కృతజ్ఞతలు తెలిపారు.

Samayam Telugu 6 Oct 2020, 11:44 am
టీఆర్ఎస్ నేత, రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ మొదలుపెట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ విజయవంతంగా కొనసాగుతోంది. తాజాగా ఈ ఛాలెంజ్‌ను మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్వీకరించారు. తన పుట్టినరోజు సందర్భంగా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ గారి పిలుపు మేరకు తన పుట్టిన రోజును పురస్కరించుకొని ఈ రోజు తన నివాసంలో మొక్కలు నాటారు పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్.
Samayam Telugu మొక్కలు నాటిన మంత్రి
talasani green india challenge


Read More: గాంధీ ఆస్పత్రి కరోనా ఖైదీల పరారీలో పోలీసుల పురోగతి

గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి ఆకాంక్ష మేరకు ఆకుపచ్చ తెలంగాణ కావాలన్న ఆలోచనతో హరితహారం కార్యక్రమంకి స్పూర్తిగా చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమాన్ని చేపట్టి నా పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటాలని విజ్ఞప్తి చేశారు. రాజ్యసభ సభ్యులు సంతోష్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటికే అనేకమంది సినీ రాజకీయ ప్రముఖులు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. 3వ విడత గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో కూడా ప్రముఖులు పాల్గొని మొక్కలు నాటుతూ మిగతా వారిని కూడా మొక్కలు నాటలని కోరుతున్నారు. ఇలా నలుమూలలా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ వ్యాప్తి చెందింది. మూడు కోట్ల మొక్కలకు ఈ ఛాలెంజ్ చేరువైంది. ప్రస్తుతం తమిళ, కన్నడ సినీ పరిశ్రమలో కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కొనసాగుతోంది.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.