యాప్నగరం

కేసీఆర్‌ ఉగ్రరూపం చూశారు.. దేశమంతా తెలంగాణ వైపే చూస్తోంది: తలసాని

తెలంగాణలో ఇకపై ఇలాంటి దారుణాలకు పాల్పడే వాళ్లు జాగ్రత్తగా ఉండాలని తలసాని అన్నారు. ఆడ పిల్లలను వేధించేందుకు ప్రయత్నించే వారిని తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదని హెచ్చరించారు.

Samayam Telugu 6 Dec 2019, 5:10 pm
దిశ హత్యాచార ఘటనలోని నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ స్పందించారు. దేశంలో హైదరాబాద్ పోలీసులు ఎప్పుడూ ప్రత్యేకమే అని కొనియాడారు. దిశకు న్యాయం జరగాలని దేశమంతా ఎదురు చూస్తోందని, ఇందుకు తగ్గట్లుగా ఎన్‌కౌంటర్‌తో తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పిందని అన్నారు. శుక్రవారం మధ్యాహ్నం ఆయన విలేకరులతో మాట్లాడారు.
Samayam Telugu Talasani


Also Read: ‘సొంత కొడుకైనా ఇలాగే చంపాలి.. ఇప్పుడు ఆమె ఆత్మ శాంతిస్తుంది’

‘‘తెలంగాణ పోలీసుల సత్తా ఏంటో గతంలోనే నిరూపించారు. ఇంతకుముందు ఉగ్రవాది అయిన వికారుద్దీన్ అండ్ గ్యాంగ్, నయీమ్ గ్యాంగ్ వంటి ఎన్నో కేసులను తెలంగాణ ప్రభుత్వం చేధించింది. ఇటీవల జరిగిన దిశ దారుణ ఘటనపై యావత్ దేశం ముక్త కంఠంతో ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో సీఎం స్పందించడం లేదని పదే పదే కేసీఆర్‌ను విమర్శించారు. ఆయన వెళ్లి పరామర్శించలేదని దుయ్యబట్టారు. ముఖ్యమంత్రి గారు రారు.. ఆయనకు ఉగ్ర రూపం వస్తే ఏ విధంగా ఉంటుందో చాలా మందికి తెలుసు.. కొంత మంది ఏ అవకాశమొచ్చినా దుమ్మెత్తి పోస్తుంటారు.’’

Also Read: కేసీఆర్ అన్న మాటలు తూటాల్లా తగిలాయి: మంత్రి పువ్వాడ అజయ్

‘‘ఓ జాతీయ ఛానెల్ డిబేట్‌లు పెట్టి మరీ విమర్శించింది. దానంతటికీ సమాధానం ఇదే. ఇప్పుడు కోట్లాది మంది ప్రజలు, జాతీయ నాయకులు సైతం తెలంగాణ ప్రభుత్వం వ్యవహరించిన విధానాన్ని మెచ్చుకుంటున్నారు. ఈ దేశానికి మార్గదర్శి లాంటిది తెలంగాణ. 2014 నుంచి ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా, వాటిని దేశమంతా అమలు చేసిన సందర్భాలున్నాయి. ఇకపై ఇలాంటి ఆక్రుత్యాలకు పాల్పడే వాళ్లు జాగ్రత్తగా ఉండాలి. ఆడపిల్లలను వేధించే వారిని తెలంగాణ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లోనూ సహించదు.’’

Also Read: ఆయుధాలు లాక్కొని దాడికి దిగడంతో.. ఎన్‌కౌంటర్‌పై సీసీ సజ్జనార్

‘‘గతంలో ఇలాంటి ఘటనలు చాలా జరిగాయి. కానీ కాలం కలిసొచ్చినప్పుడు లేదా పోయే కాలం దగ్గరికొచ్చినప్పుడే ఇలాంటి ఎన్‌కౌంటర్‌లు జరుగుతుంటాయి. అన్ని విషయాల్లో తెలంగాణ పోలీసులకు ప్రత్యేకతలున్నాయి. ఆడపిల్లలో తల్లినో, చెల్లినో చూసుకోవాలి. తేడాగా ప్రవర్తిస్తే పొద్దున జరిగినటువంటి ఎన్‌కౌంటర్‌లే జరుగుతాయి.’’ అని అన్నారు.

Also Read: డమ్మీ హోం మంత్రి, ఫామ్‌ హౌస్‌ ముఖ్యమంత్రి.. ఎన్‌కౌంటర్‌పై బీజేపీ ఎంపీ అర్వింద్

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.