యాప్నగరం

బాక్సర్ నిక్కత్ జరీన్‌కు రూ.5 లక్షలు.. మంత్రి చేతుల మీదుగా..

Hyderabad: ఈ కార్యక్రమంలో దేవరకద్ర శాసన సభ్యులు అల వెంకటేశ్వర రెడ్డి, స్పోర్ట్స్ ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, నిక్కత్ జరీన్ తండ్రి జమిల్‌లు తదితరులు పాల్గొన్నారు

Samayam Telugu 18 Jul 2020, 2:45 pm
అంతర్జాతీయ స్థాయిలో 21 ర్యాంకు సాధించిన ప్రముఖ బాక్సర్ నిక్కత్ జరీన్‌కు రూ.5 లక్షలను రాష్ట్ర ఆబ్కారీ, క్రీడా, పర్యటక, సాంస్కృతిక శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ అందించారు. తెలంగాణకు చెందిన నాట్కో ఫార్మా కంపెనీ వారు ఈ నిధులను సమకూర్చారు. తమ సీఎస్ఆర్ ఫండ్స్ ద్వారా బాక్సింగ్ కోచింగ్ కోసం కేటాయించిన 5 లక్షల రూపాయలను హైదరాబాద్‌లోని తన నివాసంలో మంత్రి నిక్కత్‌కు అందించారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర శాసన సభ్యులు అల వెంకటేశ్వర రెడ్డి, స్పోర్ట్స్ ఛైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి, నిక్కత్ జరీన్ తండ్రి జమిల్‌లు తదితరులు పాల్గొన్నారు. మధ్యాహ్నానికి మహబూబ్‌నగర్ జిల్లా పర్యటనకు వెళ్లిన మంత్రి శ్రీనివాస్ గౌడ్ జిల్లాలోని దివిటిపల్లిలో రైతు వేదిక భవన్‌ను శంకుస్థాపన చేశారు.
Samayam Telugu చెక్కు అందిస్తున్న మంత్రి
Nikkat zareen


తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.