Minister V Srinivas Goud Reviews On Wine Shops Closing In Telangana Due To Lockdown
మందు బాబుల్ని మామూలుగా మార్చేందుకు మంత్రి కీలక సూచనలు
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తుండడం వల్ల కొద్ది రోజులుగా వైన్ షాపులు మూతపడి ఉండడంతో మద్యానికి బానిసైన వారు కొంత మంది విలవిలలాడుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ వ్యాప్తంగా కొన్ని చోట్ల ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనలు చోటు చేసుకోగా, చాలా చోట్ల ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. చాలా రోజులుగా మద్యం దొరక్కపోవడంతో మరికొన్ని చోట్ల వింత వింత చేష్టలు చేస్తున్నారు. రాను రానూ ఈ పరిస్థితి తీవ్రమవుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖామంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ కమిషనర్, డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. కరోనా కారణంగా లాక్ డౌన్ సమయంలో అన్ని మద్యం దుకాణాలు మూసివేయడంతో మద్యానికి వ్యసనంగా మారిన కొందరు వ్యక్తులు మానసికంగా ఆందోళనకు గురవుతున్న ఘటనల గురించి చర్చించారు. ఈ సమీక్షలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు.
Samayam Telugu30 Mar 2020, 7:58 pm
దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ అమలు చేస్తుండడం వల్ల కొద్ది రోజులుగా వైన్ షాపులు మూతపడి ఉండడంతో మద్యానికి బానిసైన వారు కొంత మంది విలవిలలాడుతున్న సంగతి తెలిసిందే. తెలంగాణ వ్యాప్తంగా కొన్ని చోట్ల ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనలు చోటు చేసుకోగా, చాలా చోట్ల ఆత్మహత్యాయత్నం చేసుకున్నారు. చాలా రోజులుగా మద్యం దొరక్కపోవడంతో మరికొన్ని చోట్ల వింత వింత చేష్టలు చేస్తున్నారు. రాను రానూ ఈ పరిస్థితి తీవ్రమవుతున్న నేపథ్యంలో ఈ వ్యవహారంపై రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక, సాంస్కృతిక శాఖామంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ సోమవారం సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో ఎక్సైజ్ కమిషనర్, డిప్యూటీ ఎక్సైజ్ కమిషనర్లు, ఎక్సైజ్ సూపరింటెండెంట్లు పాల్గొన్నారు. కరోనా కారణంగా లాక్ డౌన్ సమయంలో అన్ని మద్యం దుకాణాలు మూసివేయడంతో మద్యానికి వ్యసనంగా మారిన కొందరు వ్యక్తులు మానసికంగా ఆందోళనకు గురవుతున్న ఘటనల గురించి చర్చించారు. ఈ సమీక్షలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు.
ఎక్సైజ్ సిబ్బంది వారిని పీహెచ్సీకి తీసుకెళ్లాలి
ఎవరైనా మద్యానికి తీవ్రంగా వ్యసనమైన వ్యక్తులు మరీ ఎక్కువగా మానసిక ఆందోళనకు, వింత చేష్టలకు గురవుతుంటే రాష్ట్రంలోని ఎక్సైజ్ శాఖ సిబ్బంది అయిన ఎక్సైజ్ సీఐలు, ఎస్సైలు ఇలాంటి వారిని గుర్తించాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ సూచించారు. ఆ వ్యక్తులను గుర్తించి వారు మానసిక వేదనకు గురి కాకుండా సరైన అవగాహన కల్పించాలని సూచించారు. అలా మాట వినకపోతే వారిని సమీపంలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి (పీహెచ్సీ) తీసుకెళ్లి, అక్కడి వైద్యులతో వారికి చికిత్స ఇప్పటించడం, లేదా కౌన్సెలింగ్ ఇప్పించడం వంటి చర్యలు తీసుకోవాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ఎక్సైజ్ అధికారులను ఆదేశించారు.
మద్యం తీవ్రమైన వ్యసనంగా ఉన్న వ్యక్తుల కుటుంబాలు ఆ వ్యక్తులపై ఎక్కువ దృష్టి పెట్టి ఈ సమయంలోనే వారి మనసు మార్చేందుకు కృషి చేయాలని సూచించారు. యోగా, ప్రాణాయామం వంటి ఆసనాలు, ధ్యానం, వ్యాయామం, ఆధ్యాత్మిక చింతన చేయించాలని చెప్పారు. అంతేకాక, కుటుంబ సభ్యులతో ఇతరత్రా ఆటలైన చదరంగం, క్యారమ్స్ వంటి ఆటలను ఆడించవచ్చని సూచనలు చేశారు. ఇలా చేస్తే వారు క్రమంగా మానసిక ఆందోళన నుంచి బయటకు వచ్చే అవకాశం ఉందని వెల్లడించారు. కుటుంబ సభ్యులతో ఎక్కువగా గడపడం వల్ల మానసిక శక్తి వస్తుందని మంత్రి అన్నారు. ఎక్కువ సమయం వారితో గడపాలని సూచించారు.
ప్రభుత్వం లాక్ డౌన్ సమయంలో అన్ని రకాల మద్యం దుకాణాలు మూసివేతపై కృతనిశ్చయంతో ఉన్నందున సంబంధిత అధికారులు దీనిపై తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. మద్యం దుకాణాలు సహా, అన్ని షాపులను బంద్ చేస్తూ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనాను నిర్మూలించడానికి ఇచ్చిన ఆదేశాలను అందరూ సమర్థంగా అమలు చేయాలని ఆదేశించారు. ఎక్కడైనా ఇతర రాష్ట్రాల నుంచి వలస వచ్చిన కార్మికులు కానీ, నిరాశ్రయులు కానీ ఉన్నట్లయితే వారిని గుర్తించి సంబంధిత అధికారులకు తెలియజేయాలని, వారికి ప్రభుత్వం సూచించిన ఫలాలు అందేలా చూడాలని మంత్రి సూచించారు.
We use cookies and other tracking technologies to provide services in line with the preferences you reveal while browsing the Website to show personalize content and targeted ads, analyze site traffic, and understand where our audience is coming from in order to improve your browsing experience on our Website. By continuing to browse this Website, you consent to the use of these cookies. If you wish to object such processing, please read the instructions described in our privacy policy/cookie policy.