యాప్నగరం

దోపిడీలో జగన్ తండ్రిని మించిపోయారు, దొంగే దొంగ అన్నట్టుంది.. మంత్రి ఘాటు వ్యాఖ్యలు

Hyderabad: చట్టపరంగా ఉన్న హక్కుతోనే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని.. రాయలసీమ లిఫ్ట్, పోతిరెడ్డిపాడు వెడల్పు జీవోలు వెనక్కి తీసుకోవాలని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి డిమాండ్ చేశారు.

Samayam Telugu 2 Jul 2021, 3:27 pm
ఏపీ-తెలంగాణ మధ్య నెలకొన్న నీటి వివాదాలపై మంత్రి జగదీశ్ రెడ్డి మరోసారి మండిపడ్డారు. ఏపీ ప్రభుత్వమే కేంద్రానికి లేఖ రాసే పరిస్థితి తెచ్చుకుందని, ప్రజలను మోసం చేయడానికే సీఎం జగన్‌ ఉత్తరాలు రాస్తున్నారని మంత్రి విమర్శించారు. సమస్య సృష్టించి పరిష్కరించమని అడగడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. కేసీఆర్ స్నేహ హస్తాన్ని మరిచి ఏకపక్షంగా ఏపీ ప్రభుత్వం వ్యవహరించిందని అన్నారు. కృష్ణా జలాల దోపిడీ విషయంలో జగన్‌ తండ్రిని మించిపోయారని అన్నారు.
Samayam Telugu జగదీశ్ రెడ్డి (ఫైల్ ఫోటో)
jagadish reddy


చట్టపరంగా ఉన్న హక్కుతోనే విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నామని.. రాయలసీమ లిఫ్ట్, పోతిరెడ్డిపాడు వెడల్పు జీవోలు వెనక్కి తీసుకోవాలని జగదీష్‌రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ, ఏపీ పోలీసులు ప్రాజెక్ట్‌ల దగ్గర బందోబస్తును పెంచడం ఉద్రిక్తతకు దారితీస్తోంది. సాగర్ పవర్ ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తిని నిలిపి వేయాలంటూ వినతి పత్రం ఇచ్చేందుకు వచ్చిన ఏపీ అధికారులను తెలంగాణ సరిహద్దు దగ్గరే ఆపేశారు పోలీసులు. ఏపీ అధికారుల వినతి పత్రాన్ని తీసుకునేందుకు తెలంగాణ జెన్‌కో అధికారులు నిరాకరించారు.

మరోవైపు, ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలంగాణలో విద్యుత్ ఉత్పత్తి ఆపాలంటూ ప్రధాని నరేంద్ర మోదీకి లేఖ రాయడంపై తెలంగాణ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు. శ్రీశైలంలో జల విద్యుత్ ఉత్పత్తి ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపే ప్రసక్తే లేదని మంత్రి స్పష్టం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టు కట్టిందే విద్యుత్ ఉత్పత్తి కోసం అని తేల్చి చెప్పారు. తమ పోరాటం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపైన కానీ, ఆ రాష్ట్ర ప్రజలపై కాదని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అన్నారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.