యాప్నగరం

చిత్తూరులో దారుణం.. పెళ్లయిన రోజే హత్య, రాత్రికి రాత్రే శవాన్ని కాల్చి బూడిద చేశారు!

చిత్తూరు జిల్లాలో మరో పరువు హత్య చోటు చేసుకుంది. పెళ్లయిన రోజే మైనర్ బాలిక అనుమానాస్పద రీతిలో ప్రాణాలు వదిలింది. తెల్లవారే సరికే తల్లిదండ్రులు ఆమె శవాన్ని కాల్చి బూడిద చేయడం అనుమానాలకు తావిస్తోంది.

Samayam Telugu 13 Oct 2019, 9:12 pm
చిత్తూరు జిల్లాలో మరో పరువు హత్య జరిగింది. పలమనేరు మండలంలోని ఊసరపెంటలో జరిగిన పరువు హత్య గురించి మరువక ముందే.. శాంతి పురం మండలం, రెడ్లపల్లిలో చందన అనే మైనర్ బాలిక అనుమానాస్పద రీతిలో మరణించింది. కులాంతర వివాహమే ఆమె మరణానికి కారణమని అనుమానిస్తున్నారు. తల్లిదండ్రుల అభీష్టానికి వ్యతిరేకంగా చందన పెళ్లి చేసుకుంది. పెళ్లయిన మరుసటి రోజే ఆమె చనిపోవడం, తెల్లవారే లోగానే మృతదేహాన్ని దహనం చేయడం పలు అనుమానాలకు తావిస్తోంది.
Samayam Telugu chittor honour killing


చందన ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుందని అమ్మాయి తల్లిదండ్రులు చెబుతుండగా.. అబ్బాయి తరఫు వారు మాత్రం.. చందన తల్లిదండ్రులే ఆమెను హత్య చేశారని ఆరోపిస్తున్నారు. చందన మరణం వెనుక గ్రామ పెద్దల హస్తం ఉందని అబ్బాయి తరఫు వారు ఆరోపిస్తున్నారు. తమ ప్రాణాలకు కూడా ముప్పు ఉందని, రక్షణ కల్పించాలని కోరుతున్నారు.

వివరాల్లోకి వెళ్తే.. శాంతిపురం మండలం రెడ్లపల్లికి చెందిన చందన.. అదే మండలంలోని మడిఒగ్గు గ్రామానికి చెందిన నంద కుమార్ (22) కుప్పంలోని ఓ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. గత కొంత కాలంగా వీరిద్దరూ ప్రేమించుకుంటున్నారు. దళిత సామాజిక వర్గానికి చెందిన నందకుమార్‌ను చందన ప్రేమించడం.. ఆమె కుటుంబ సభ్యులకు నచ్చలేదు.

Read Also: జగన్‌కు శ్రీరెడ్డి సలహాలు.. ఆయనతో శత్రుత్వం వద్దట!

ఇంట్లో వాళ్లు తెలియకుండా శనివారం వీరిద్దరూ కుప్పంలోని గంగమ్మ ఆలయంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. తమ కుమార్తె వివాహం గురించి సమాచారం అందుకున్న అమ్మాయి తల్లిదండ్రులు.. పెళ్లి పీటల మీది నుంచి చందనను నేరుగా ఇంటికి తీసుకెళ్లి తాళి తీసివేశారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.

తరవాత కథనం

Telugu News App: ఏపీ, తెలంగాణకు సంబంధించిన లేటెస్ట్ అప్‌డేట్స్‌, జాతీయ, అంతర్జాతీయ, ఎడ్యుకేషన్, బిజినెస్, సినిమా, ఆధ్యాత్మికం, స్పోర్ట్స్, వైరల్ కథనాల కోసం తెలుగు సమయం యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి.
తాజా వార్తల అప్డేట్ల కోసం Samayam Telugu ఫేస్‌బుక్పేజీను లైక్ చెయ్యండి.